ఏపీకీ 5జీ సేవలు ప్లీజ్-విజయవాడ, విశాఖ సహా ఈ నగరాల్లో- కేంద్రానికి జీవీఎల్ లేఖ
ఏపీలోని విశాఖపట్నం సహా పలు నగరాల్లో 5G సేవలను ప్రారంభించాలని కేంద్రానికి బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఇవాళ లేఖ రాశారు. విశాఖపట్నంలో 5G సేవల వ్యూహాత్మక, ఆర్థిక ప్రాముఖ్యతను లేఖలో కేంద్రమంత్రికి ఆయన వివరించారు.
రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కి ఇవాళ రాసిన లేఖలో దేశంలోని 13 నగరాల్లో 5G సేవలను ప్రారంభించడం ద్వారా కొత్త డిజిటల్ యుగానికి నాంది పలికినందుకు ప్రధాని నరేంద్రమోదీకి అభినందనలు తెలిపారు. అల్ట్రా-హై-స్పీడ్ ఇంటర్నెట్ 5G టెక్నాలజీ డిజిటల్, ఆర్థిక విప్లవానికి నాంది పలుకుతుందని పేర్కొన్న జీవీఎల్.. తదుపరి దశలోని నగరాల్లో ముఖ్యమైన విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, తిరుపతి వంటి నగరాలలో 5G సేవలను ప్రారంభించేందుకు ప్రాముఖ్యతనివ్వాలని కేంద్ర మంత్రిని కోరారు.

కేంద్రమంత్రికి రాసిన లేఖలో ముఖ్యంగా విశాఖపట్నం నగరానికి 5G సేవలను తీసుకురావాల్సిన అవసరాన్ని ఎంపీ జీవీఎల్ గుర్తుచేశారు. విశాఖపట్నం చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం అని, ఏపీకి నిజమైన ఆర్థిక వృద్ధిని ఇచ్చే ఇంజిన్ వంటిదని ఎంపీ తెలిపారు. విశాఖపట్నం తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయానికి స్థావరంగా ఉందని, విశాఖపట్నం పోర్ట్, హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్, హిందుస్తాన్ పెట్రోలియం, సమీర్ మొదలైన ఇతర వ్యూహాత్మక సంస్థలతో పాటు ప్రధాన భారతీయ కోస్ట్ గార్డ్ కార్యకలాపాలకు కేంద్రంగా ఉందని తెలిపారు. కాబట్టి విశాఖపట్నం జాతీయ భద్రతా దృష్ట్యా అత్యంత వ్యూహాత్మక, ముఖ్యమైన ప్రాంతమని జీవీఎల్ తెలిపారు. ఆర్థిక, వ్యూహాత్మక, భద్రతా కారణాల దృష్ట్యా 5G సేవలను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు విశాఖపట్నానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలని రాజ్యసభ ఎంపీ జీవీఎల్ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను అభ్యర్థించారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications