మోడీని జగన్ కలిస్తే తప్పేంటి, కేసులకేం సంబంధం: బాబుకు బీజేపీ గట్టి షాక్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని కలవడంపై చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని కలవడంపై చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ తెలుగుదేశం పార్టీకి పెద్ద షాకిచ్చారు.

కలిస్తే తప్పేమిటి
జగన్ ఢిల్లీలో ప్రధాని మోడీని కలవడంలో తప్పేముందని ప్రశ్నించారు. జగన్పై కేసులు ఉంటే కోర్టులు చూసుకుంటాయని తేల్చి చెప్పారు. మనది ప్రజాస్వామ్య దేశమని, ఎవరు ఎవరినైనా కలవవచ్చునని చెప్పారు.

జగన్ ఒక్కరే వెళ్లలేదు కదా..
ప్రధాని నరేంద్ర మోడీ వద్దకు జగన్ ఒక్కరే వెళ్లలేదని, ఆయన వెంట ఎంపీలు కూడా ఉన్నారని చెప్పారు. అసలు ప్రధాని మోడీని కలవడానికి కేసులకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. కేసులు కోర్టుల విషయం అన్నారు.

సిద్ధార్థనాథ్ గట్టి జవాబు
కాగా, జగన్ ప్రధాని మోడీని కలవడాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు తప్పుబట్టిన విషయం తెలిసిందే. ఆర్థిక ఉగ్రవాది అయిన జగన్కు మోడీ అపాయింటుమెంట్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. దీనికి సిద్ధార్థనాథ్ సింగ్ గట్టి కౌంటర్ ఇచ్చారు.

టిడిపి ఆరోపణలు
ఈడీ, సీబీఐ కోర్టుల్లో 12 ఛార్జీషీట్లలో నమోదైన ఆర్థిక ఉగ్రవాది జగన్కు ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వడం చాలా దురదృష్ణకరమని టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసుల వల్లే ప్రధాని మోడీని జగన్ కలిశారని ఆరోపించారు.
-
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం!












Click it and Unblock the Notifications