ఇందాపూర్ డెయిరీతో జరిగిందిదే - బొత్సా సంచలనం..!!
లడ్డూ వివాదం కొత్త మలుపు తీసుకుంది. లడ్డూ వివాదం పైన శాసన మండలిలో వివాదం చోటు చేసుకుంది. వైసీపీ సభ్యులు ఇందాపూర్ డెయిరీ గురించి ప్రస్తావిస్తూ అధికార కూటమిని టార్గెట్ చేసారు. దేవదేవుడి ప్రసాదంపై అసత్యాలు ప్రచారం చేశారని.. ఎలాంటి కొవ్వు లేదని సీబిఐ తేల్చిందని శాసనమండలి విపక్షనేత బొత్సా సత్యనారాయణ మండిపడ్డారు. వాస్తవాలు తేల్చాల నే సభలో చర్చించమని కోరుతున్నామని బొత్సా పేర్కొన్నారు.
శాసన మండలిలో ఇందాపూర్ డెయిరీపై చర్చకు వైయస్ఆర్సీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో, బొత్సా సత్యనారాయణ ఇదే వివాదం పైన కీలక వ్యాఖ్యలు చేసారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేక డొల్ల బడ్జెట్ పెట్టారని విమర్శించారు. హెరిటేజ్ సంస్థ ఇందాపూర్తో చీకటి ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. సభలో బడ్జెట్తో పాటు ఇందాపూర్, హెరిటేజ్పై చర్చించాల్సిందేనని డిమాండ్ చేసారు. ఏ వర్గం అవసరాలు తీర్చలేని బడ్జెట్ ప్రవేశ పెట్టారని ఆరోపించారు. తాము చర్చించాలని కోరితే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండి పడ్డారు. తాము చెప్పిన దాంట్లో అవాస్తవాలుంటే వాస్తవాలు తేల్చడానికి చర్చకు రావాలని.. తాము ఆధారాలతో సహా నిరూపిస్తామని బొత్సా సవాల్ చేసారు. 320కి కొనుగోలు చేసే నెయ్యి 700 కి పెంచడం వెనుక కారణం తెలియాలన్నారు. పాల రేటు అప్పట్లో తక్కువ ఇప్పుడు పెరిగిందంటున్నారని.. ఏ సంవత్సరంలో పాల రేటు ఎంతో చర్చపెట్టాలని డిమాండ్ చేసారు.

మండలి లో చర్చ కోసం డిమాండ్
చంద్రబాబు, పవన్కు చిత్తశుద్ధి ఉంటే చర్చకు రావాలని బొత్సా కోరారు. ఈ దోపిడీని బీజేపీ నేతలు సమర్థిస్తారా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు, కూటమి ప్రభుత్వానికి ఒక్కరోజు కూడా అధికారంలో కొనసాగే హక్కు లేదని వ్యాఖ్యానించారు. రైతులు గిట్టుబాటు ధరల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారని... నిరుద్యోగులు భృతి కోసం ఉద్యోగాల కోసం చూస్తున్నారని చెప్పుకొచ్చారు. విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం చూస్తున్నారని... హెరిటేజ్కు దోచిపెట్టడానికే ఇందాపూర్ను తెచ్చారని తీవ్ర వ్యాఖ్యాలు చేసారు. ఇందాపూర్ను అడ్డుపెట్టుకుని హెరిటేజ్కు దోచిపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇద్దరు ఎమ్మెల్సీలు ప్రలోభాలకు ఆశపడి తమ పార్టీని వదిలిపోయారని చకప్పుకొచ్చారు. ఇందాపూర్తో లాలూచీపడి దోచుకోవాలనే ప్రయత్నం జరిగిందని.. తాము చెప్పేది అబద్ధమైతే చర్చకు రావాలని డిమాండ్ చేసారు. వైయస్ఆర్సీపీ పరిపాలనలో లోపం ఉంటే ఈ ప్రభుత్వంలో ఆదాయం పెరగాలి కదా అని బొత్సా ప్రశ్నించారు.
-
స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల సేవల పై ప్రభుత్వం అనూహ్య నిర్ణయం, తాజా ఆదేశాలు..!! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
జగన్ కు జనాలిచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా సరిపోలేదేమో..మంత్రి లోకేష్ సెటైర్లు -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications