వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పూణేలో నందిగామ యువతి ఆత్మహత్య, దర్యాప్తు

By Pratap
|
Google Oneindia TeluguNews

 BPO employee found dead in Wakad
పూణే/ విజయవాడ: మహారాష్ట్రలోని పూణేలో ఆంధ్రప్రదే‌శ్‌లోని కృష్ణా జిల్లా నందిగామకు చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది. అదనపు కట్నం కోసం భర్త వేధించడం వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

నందిగామ యువతిని పాతికేళ్ల ఖజాబీ మునిబ్ మొహమ్మద్‌గా గుర్తిచారు. ఆమెకు మధిక యువకుడితో మూడేళ్ల క్రితం వివాహం జరిగినట్లు తెలుస్తోంది. బిపివో కార్యాలయంలో పనిచేస్తున్న ఆ యువతి వాకడ్‌లోని మంగళ్‌నగర్‌లో గల తన అద్దె ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ నోట్ ఏదీ లభించలేదు.

శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఇంటి యజమాని కూతురైన నాలుగేళ్ల అమ్మాయి యువతి ఖజాబీ సీలింగ్‌కు వేలాడుతూ కనిపించడాన్ని గమనించి తండ్రికి చెప్పింది. అతను పోలీసులకు సమాచారం అందించాడు.

పోలీసులు యువతిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు తేల్చారు. యువతి మరణంపై పోలీసులు ఆమె తల్లిదండ్రులకు తెలియజేశారు. ఖజాబీ భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.

English summary
A 25-year-old employee of a Business Process Outsourcing (BPO) company, belongs to Andhra Pradesh, allegedly committed suicide at her rented flat in Mangalnagar in Wakad on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X