నంద్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘రోజా ఉండగా గెలుపా?! నంద్యాల తీర్పుతో ఫ్యాన్ రెక్కలు విరిగాయి’

నంద్యాల ఉప ఎన్నిక ఫలితాల్లో అక్కడి ప్రజలు ఇచ్చిన తీర్పుతో వైయస్సార్ కాంగ్రెస్ నేతలు నేతలు బోర్లా పడ్డారని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. టీడీపీ ఘన విజయంతో దెబ్బకు వైయస్ జగన్ పార్టీ ఫ్యాన్‌

|
Google Oneindia TeluguNews

Recommended Video

"Aunty "Is The Suitable Word For YSRCP MLA Roja : TDP MLA Bonda Uma - Oneindia Telugu

విజయవాడ: నంద్యాల ఉప ఎన్నిక ఫలితాల్లో అక్కడి ప్రజలు ఇచ్చిన తీర్పుతో వైయస్సార్ కాంగ్రెస్ నేతలు నేతలు బోర్లా పడ్డారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. టీడీపీ ఘన విజయంతో దెబ్బకు వైయస్ జగన్ పార్టీ ఫ్యాన్‌ రెక్కలు విరిగిపడ్డాయని విమర్శించారు.

నంద్యాల ఉపఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు బుద్ధా వెంకన్న. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రోజా, కొడాలి నానిపై తీవ్ర విమర్శలు చేశారు.

Budha Venkanna responded on Nandyal bypoll

రోజా, నాని ఉన్నంత వరకు వైయస్సార్ కాంగ్రెస్ గెలుపు కలగానే మిగిలిపోతుందని జోస్యం చెప్పారు. తమ అధినేత చంద్రబాబుపై ఇప్పటికైనా విమర్శలు మానుకోకపోతే ప్రజలే బుద్ధిచెప్పడానికి సిద్ధంగా ఉన్నారని వెంకన్న అన్నారు.

ప్రజాస్వామ్యం ఖూనీ చేశారు: రామకృష్ణ

నంద్యాల ఉపఎన్నికలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. మంగళవారం కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో భాగంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ విచ్చలవిడిగా డబ్బులు పంచాయని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు బదులు.. ఎవరు ఎక్కువ ఖర్చు పెడితే వారికే పదవులు ఇస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు.

English summary
Telugudesma Party MLC Budha Venkanna on Tuesday responded on Nandyal bypoll issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X