వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ చేరిన రాజధాని అమరావతి ఆందోళన .. గాంధీ జయంతినాడు రాజ్ ఘాట్ వద్ద మౌన ప్రదర్శన

|
Google Oneindia TeluguNews

రాజధానిగా అమరావతి కొనసాగాలని ఉద్యమం ఇంకా సాగుతూనే ఉంది. మొదట్లో రాజధాని అమరావతి ఉద్యమం ఉధృతంగా సాగినా, మధ్యలో కరోనావైరస్ లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ప్రచారానికి దూరమైంది. కానీ నేటికీ అమరావతి రైతులు ఏదో ఒక రూపంలో తమ ఆందోళనలు తెలియజేస్తూనే ఉన్నారు రాజధాని ప్రాంత రైతులు . రాజధానిగా అమరావతి నే కొనసాగించాలి జెఏసి నేతలు దీక్షలు చేస్తున్నారు.

 దుర్మార్గుల పాలనలో మంచివాళ్ళకు కష్టాలు .. ఏపీనే ఉదాహరణ : అమరావతి భూములపై చంద్రబాబు దుర్మార్గుల పాలనలో మంచివాళ్ళకు కష్టాలు .. ఏపీనే ఉదాహరణ : అమరావతి భూములపై చంద్రబాబు

రాజధాని రైతుల పోరాటాన్ని ఇప్పటికే పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళిన రాజధాని ప్రాంత రైతులు ఇన్ని రోజుల తర్వాత కూడా కేంద్రం రాజధాని అమరావతి విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు . తమ పోరాటంలో భాగంగా అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జేఏసీ నేతలు ఢిల్లీ వెళ్లారు. నేడు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఢిల్లీ వెళ్లిన జేఏసీ నేతలు రాజ్ ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. అనంతరం ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ మౌన ప్రదర్శన చేపట్టారు.

Capital Amaravati JAC Silent demonstration at Rajghat on Gandhi Jayanti

Recommended Video

Agriculture Bills 2020 : Ysrcp Supports And Congress Denis Bill In Loaksabha

రైతుల త్యాగాలతో ఏర్పడిన అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వారు విజ్ఞప్తి చేశారు .అమరావతి జేఏసీతో పాటు అమరావతి ప్రాంత రైతులు , తెలుగుదేశం పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణ మహాత్ముడికి నివాళులు అర్పించారు. అమరావతి ఏపీ రాజధానిగా కొనసాగించాలని శాంతియుత మౌన ప్రదర్శన ద్వారా ప్రధానమంత్రికి తెలిసేలా నిరసన చేస్తున్నామని జేఏసీ నేతలు పేర్కొన్నారు. రాజధాని కోసం 290 రోజులుగా గాంధేయ మార్గంలో నిరసన కొనసాగిస్తున్నామని వారు పేర్కొన్నారు. అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగించేలా పాలకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని మహాత్ముని వేడుకున్నట్లుగా జేఏసీ నేతలు చెప్తున్నారు.

English summary
The JAC leaders went to Delhi under the auspices of the Amaravati JAC. JAC leaders who left for Delhi today on the occasion of Mahatma Gandhi Jayanti paid tributes to Mahatma Gandhi at Rajghat. Afterwards, the Amaravati JAC staged a silent Protest demanding the continuation of Amaravati as the capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X