మాజీ మంత్రి పెద్దిరెడ్డికి బిగ్ షాక్
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయనపై అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. చిత్తూరు జిల్లా, పులిచెర్ల మండలం లోని మంగళం పేటలో ఉన్న అటవీ భూమిలోకి అక్రమంగా ప్రవేశించి 27.98 ఎకరాలను కబ్జా చేశారని ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే ఆరోపణలపై పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులపైనా అటవీశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. అటవీ శాఖ అధికారులు ఈ నెల 6న కేసు నమోదు చేశారు.
చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట గ్రామంలో ఉన్న అటవీ భూమిలోకి అక్రమంగా ప్రవేశించడమే కాకుండా స్థలాన్ని ఆక్రమించి, జీవ వైవిధ్యానికి నష్టం కలిగించినట్లు ప్రాథమిక నేర నివేదికలో అధికారులు తెలిపారు.

ప్రభుత్వ అటవీ భూమిలో 27.98 ఎకరాలను పెద్ది రెడ్డి, అతని కుటుంబ సభ్యులు కబ్జా చేసినట్లు తేలిందని అన్నారు. నిందితులుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకానాథ రెడ్డి, పెద్దిరెడ్డి తమ్ముడి భార్య ఇందిరమ్మ కూడా ఉన్నట్లు అధికారులు అన్నారు.
మరోవైపు ఈ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. నిందితులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం దీనిపై అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications