సీబీఐ కోర్టులో సీఎం వైఎస్ జగన్కు చుక్కెదురు: ‘ఏపీ ప్రజలపై రూ. 30కోట్ల భారం’
హైదరాబాద్/అమరావతి: అక్రమాస్తుల సీబీఐ, ఈడీ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరోసారి చుక్కెదురైంది. ఈడీ కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపునకు సీబీఐ న్యాయస్థానం నిరాకరించింది. తన బదులు జగతి పబ్లికేషన్స్ ప్రతినిధి హాజరయ్యేందుకు జగన్ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది.

మినహాయింపు లేదు..
నాంపల్లిలోని సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ శుక్రవారం జరిగింది. ఈరోజు విచారణకు సీఎం జగన్ మినహాయింపు కోరారు. అయితే, కోర్టు అందుకు నిరాకరించింది. ఎంపీ విజయసాయి రెడ్డి, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి, విశ్రాంత అధికారులు శామ్యూల్, రాజగోపాల్ తదితరులు కోర్టుకు సీబీఐ హాజరయ్యారు.

జగన్ కోర్టు ఖర్చు రూ. 30 కోట్ల భారం ప్రజలపై..
మరోవైపు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కేసులను ప్రస్తావిస్తూ టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. సీబీఐ, ఈడీ కేసులు పర్యవేక్షించుకునేందుకే శుక్రవారం అసెంబ్లీకి సెలవు ప్రకటించారని ఆరోపించారు. అవినీతి, అక్రమ కేసుల్లో సీఎం జగన్ కోర్టుకు హాజరు కావడం వల్ల ప్రభుత్వంపై ఏడాదికి రూ. 30 కోట్ల వరకు భారం పడుతుందని దేవినేని వ్యాఖ్యానించారు. అవినీతి సీఎం వల్ల రాష్ట్ర ప్రజలు ఆ భారం భరించాలా? అని ప్రశ్నించారు.

కోర్టుకు వెళ్తామంటే దేవినేని..
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో దేవినేని మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ తన సొంత అజెండా అమలు చేస్తున్నారని.. ఎంత ప్రయత్నించినా మండలి రద్దు కాదని అన్నారు. మండలి విషయంలో సీఎం జగన్ తప్పుడు నిర్ణయం తీసుకుంటే కోర్టుకెళ్తామన్నారు.

ఏపీలో అరాచక పాలన సాగుతోంది..
అక్రమ ఆస్తుల కేసులో ఏ2 ముద్దాయి విజయసాయి రెడ్డికి మండలిలో ఏం పని? అని దేవినేని ప్రశ్నించారు. ఎమ్మెల్సీలను ప్రలోభపెట్టేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు కోరుతూ కోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. తప్పు చేస్తున్నందునే శాసన మండలి ప్రసారాల లైవ్ నిలిపివేశారని ఆరోపించారు. మండలి ఛైర్మన్పై దాడికి యత్నించారని అన్నారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న రైతులను హింసిస్తున్నారని మండిపడ్డారు. మీడియాపై ఆంక్షలు పెడుతున్నారని, ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. ఏపీలో అరాచక పాలన నడుస్తోందని దుయ్యబట్టారు.
-
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
కుమార్తెకు లోకేష్ ఊహించని పెళ్లి గిఫ్ట్ -అవాక్కైన టీడీపీ ఎమ్మెల్యే..! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!












Click it and Unblock the Notifications