కేంద్రం గ్రీన్ సిగ్నల్: దుర్గగుడి ప్లైఓవర్కు రూపు రేఖలు ఖరారు, 300 కోట్లని అంచనా
విజయవాడ: ఎప్పటినుంచో మోక్షం లభిస్తుందని చూస్తున్న విజయవాడ దుర్గగుడి ప్లైఓవర్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్లైఓవర్ మార్గానికి సంబంధించిన రెండో అలైన్మెంట్ ప్రతిపాదనను ఆమోదిస్తూ ఆర్ అండ్ బీ ప్రిన్సిపల్ సెక్రటరీకి గురువారం లేఖ రాసింది.
ప్లైఓవర్ నిర్మాణానికి కేంద్ర ఉపరితల రవాణా శాఖ రూపురేఖలను ఖరారు చేసింది. ఈ వంతెన నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని సమగ్ర ప్రాజెక్టు నివేదిక కోరింది. దీనికి సంబంధించిన వివరాలను విజయవాడ ఎంపీ కేశినేని నాని వెల్లడించారు.

ప్రతిపాదిత ప్లైఓవర్ను కుమ్మరిపాలెం నుంచి కార్పొరేషన్ కార్యాలయం వెనకవైపు వరకు 2.3 కిలోమీటర్ల పొడవున నాలుగు లైన్ల ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. దీనికి సుమారు రూ. 300 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు.
డీపీఆర్ అంగీకరిస్తే వెంటనే నిధులు విడుదల చేస్తామని కేంద్రం ప్రభుత్వం ఆ లేఖలో స్పష్టం చేసింది. త్వరలోనే దుర్గగుడి ప్లైఓవర్ పనులకు శంకుస్ధాపన చేయనున్నట్లు ఎంపీ కేశినేని నాని వెల్లడించారు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్!












Click it and Unblock the Notifications