ఏపీకి కేంద్రం గుడ్న్యూస్: రూ. 21 వేల కోట్ల ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్!
ఏపీకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం, సరఫరా సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో రూ.21,000 కోట్ల భారీ 'గ్రీన్ ఎనర్జీ కారిడార్' ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో 1,200 కిలోమీటర్ల మేర కొత్త విద్యుత్ లైన్లు వేసి ఏకంగా 10,000 మెగావాట్ల విద్యుత్ సరఫరా నెట్వర్క్ను అందుబాటులోకి తీసుకురానున్నారు.
ప్రాజెక్ట్ లక్ష్యం
కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖతో రాష్ట్ర అధికారులు జరిపిన చర్చల అనంతరం ఈ కీలక ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. ప్రాజెక్టు అమలుకు సంబంధించిన అనుమతులు ఇప్పటికే దక్షిణ ప్రాంత విద్యుత్ కమిటీ(SRPC), కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి(CERC)ల నుంచి వచ్చాయి. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను 2026-27 కేంద్ర బడ్జెట్లో కేటాయించేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ కారిడార్ ప్రధానంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల మధ్య 1,200 కిలోమీటర్ల మేర హైటెన్షన్ విద్యుత్ లైన్ల ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకుంది.

రాయలసీమ నుంచి ఉత్తరాంధ్రకు విద్యుత్ రవాణా
ఆంధ్రప్రదేశ్లో సోలార్ (సౌర), విండ్ (పవన) విద్యుత్ ఉత్పత్తికి అత్యంత అనుకూలమైన ప్రాంతాలు రాయలసీమ (కడప, అనంతపురం, కర్నూలు), ఉత్తరాంధ్ర ప్రాంతాలే. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఈ ప్రాంతాల నుంచి ఉత్పత్తి అయ్యే అదనపు విద్యుత్ను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు సులభంగా, సమర్థవంతంగా తరలించడానికి వీలు కలుగుతుంది. ఈ ప్రాజెక్టులో ఇది రెండో దశగా భావిస్తున్నారు. మొదటి దశలో 2015లోనే అనంతపురం నుంచి రామాయపట్నం వరకు రూ. 21,800 కోట్లతో 9,700 కిలోమీటర్ల విద్యుత్ లైన్ల పనులు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర అధికారులు ప్రాజెక్టు వ్యయంలో 40 శాతం నిధులను గ్రాంటుగా ఇవ్వాలని కేంద్రాన్ని కోరగా.. కేంద్రం మాత్రం 30 శాతం గ్రాంటుగా ఇవ్వడానికి మొగ్గు చూపుతోంది. ఈ నిధుల కేటాయింపుపై చర్చలు కొనసాగుతున్నాయి.
ఏపీలో పునరుత్పాదక ఇంధన రంగం వృద్ధి
ఈ గ్రీన్ ఎనర్జీ కారిడార్ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన రంగానికి ఒక బలమైన మద్దతుగా నిలవనుంది. 2014 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 80,798 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతులు లభించాయి. కూటమి ప్రభుత్వం జూన్ నెల నుంచి 38 సంస్థలతో సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ పవర్ (PSP) ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకుంది. రానున్న మూడేళ్లలో మరో 15 వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం అందుబాటులోకి రానుంది. ఈ కొత్త ప్రాజెక్టులు ఎక్కువగా కడప, అనంతపురం, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లోనే కేంద్రీకృతమవుతున్నాయి.
వీలింగ్ ఛార్జీల భారం తగ్గింపు
ప్రస్తుతం రాయలసీమ ప్రాంతంలో దాదాపు 5,000 మెగావాట్ల యూనిట్లు పనిచేస్తున్నాయి. కొత్త ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే, ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. ఈ అదనపు విద్యుత్ను ఇతర ప్రాంతాలకు తరలించడానికి ప్రస్తుతం రాష్ట్రం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్కు (PGCIL) చెందిన నెట్వర్క్ను వినియోగించాల్సి వస్తుంది. దీనివల్ల రాష్ట్రం భారీ మొత్తంలో వీలింగ్ ఛార్జీలు చెల్లించాల్సిన భారం పడుతోంది. కొత్త గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటుతో రాష్ట్రానికి ఈ వీలింగ్ ఛార్జీల భారం తగ్గుతుంది, తద్వారా విద్యుత్ సరఫరా వ్యవస్థ ఆర్థికంగా మరింత పటిష్టమవుతుంది.
సబ్స్టేషన్ల అనుసంధానం
విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా నిరంతరాయంగా సరఫరా చేయడానికి, ఈ కారిడార్ ద్వారా కీలకమైన సబ్స్టేషన్లను అనుసంధానిస్తున్నారు. ఓర్వకల్లు, గనిలోని 765 కేవీ సబ్స్టేషన్లతో పాటు, నక్కపల్లి, కాకినాడ, గంగవరం, కృష్ణపట్నం తదితర 17 (400 కేవీ) సబ్స్టేషన్లను ఈ కారిడార్కు కలుపుతున్నారు.ఈ అనుసంధానం వల్ల ఏదైనా సబ్స్టేషన్లో సాంకేతిక లోపం ఏర్పడితే, వెంటనే మరో సబ్స్టేషన్ నుంచి విద్యుత్ను అందించే వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది.
గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులకు మద్దతు
విశాఖపట్నం జిల్లా పూడిమడకలో ఎన్టీపీసీ, జెన్కో సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న గ్రీన్ హైడ్రోజన్ పార్కు, కాకినాడలో గ్రీన్కో సంస్థ ఏర్పాటు చేస్తున్న గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ హైడ్రోజన్ తయారీ ప్రాజెక్టులు వంటి పర్యావరణహిత ప్రాజెక్టులకు నిరంతరాయ విద్యుత్ సరఫరా అవసరం. కొత్త విద్యుత్ నెట్వర్క్ ఏర్పాటు ఈ కీలక ప్రాజెక్టుల పురోగతికి కీలకంగా మారనుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన రంగంలో దేశంలోనే మరింత దూకుడుగా ముందుకు వెళ్లడానికి బలమైన మౌలిక వసతి లభించినట్టు అవుతుంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications