మోడి చేతిలోనే: టిఎస్సార్, 'హోదా దిశగా కేంద్రం అడుగు!', అండమాన్లో రాజప్ప ప్రచారం
విజయవాడ/విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం రాజకీయాలకు అతీతంగా పోరాడాలని ఎంపీ సుబ్బిరామి రెడ్డి శుక్రవారం నాడు విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా తీసుకు రావడంలో అందరికంటే ఎక్కువ బాధ్య టిడిపిదే అన్నారు. ప్రధాని మోడీ చేతిలోనే ఏపీకి ప్రత్యేక హోదా అన్నారు. కాగా, సుబ్బిరామి రెడ్డి విశాఖలోని ఆనందపురం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.

ప్రత్యేక హోదా వస్తుంది: బొండా ఉమ
ఏపీకి ప్రత్యేక హోదా వచ్చి తీరుతుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించే విషయంపై కేంద్రం ముమ్మరంగా కసరత్తు చేస్తోందన్నారు.
శుక్రవారం ఉదయం ఓ టీవీ చానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని.. ప్రత్యేక హోదా పైన ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో గురువారం జరిగిన నీతి ఆయోగ్ భేటీనే ఇందుకు ఉదాహరణ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించేందుకు ఉన్న అడ్డంకులపై నీతి ఆయోగ్ సమావేశం చర్చించిందన్నారు.
అండమాన్ తెలుగు ప్రజలకు అండగా టిడిపి: చినరాజప్ప
అండమాన్లోని తెలుగు ప్రజలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాలయల చినరాజప్ప చెప్పారు.
అండమాన్ నికోబర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి తరఫున ఆయన ప్రచారం చేశారు. జాతీయ పార్టీగా అవతరించనున్న నేపథ్యంలో టిడిపికి అండమాన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుతో నాంది పలుకుతామన్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications