తెలంగాణ అభ్యంతరాల తోసివేత: గవర్నర్‌గిరే ఖాయం

Centre perticular about powers to governor on Hyderabad
న్యూఢిల్లీ : గవర్నర్‌కు అధికారాలు అప్పగింతపై తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలను ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. హైదరాబాద్ శాంతి భద్రతలపై గవర్నర్‌కు పూర్తి అధికారాలు ఉంటాయని స్పష్టం చేసింది.

ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి త్వరలో కేంద్రం లేఖ రాయనుంది. గవర్నర్ అధికారాలపై తెలంగాణ ప్రభుత్వానికి వివవరణ ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. విభజన చట్టంలోని సెక్షన్ 8 ప్రకారమే ఉమ్మడి రాజధానిలో గవర్నర్‌కు అధికారాలు కట్టబెట్టామని కేంద్రం స్పష్టం చేసింది.

సెక్షన్ 8లో లేని అధికారాలను గవర్నర్‌కు ఇచ్చారంటూ తెలంగాణ ప్రభుత్వం వినిపిస్తున్న వాదనను కేంద్రం కొట్టిపారేసింది. హైదరాబాదు శాంతిభద్రతలపై అధికారాలను గవర్నర్‌కు అప్పగించాలని కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. అందుకు తెలంగాణ ప్రభుత్వం సుముఖంగా లేదు.

కేంద్రం ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. అయినా వెనక్కి తగ్గకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీంతో హైదరాబాదు శాంతిభద్రతలు గవర్నర్ చేతిలోకి వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+