భారీగా తరలిన మహిళలు: ఆలకించిన బాబు(పిక్చర్స్)
పశ్చిమగోదావరి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల జిల్లా పర్యటన ముగిసింది. తొలి రోజు రైతు సదస్సులో ప్రసంగించిన చంద్రబాబు వివిధ వర్గాల ప్రజల్లో భరోసా నింపుతూ అదే సమయంలో విభజన వల్ల ఏర్పడిన ఇబ్బందులను, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను, భవిష్యత్ పరిణామాలను వివరించారు. మలిరోజు మహిళా సదస్సులో పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రాభివృద్ధిలో మహిళలు తమవంతు సాయం అందించాలని కోరారు.
తొలుత నరసన్నపాలెంలో, తర్వాత బయ్యనగూడెంలో మాట్లాడిన చంద్రబాబు అనంతరం కొయ్యలగూడెంలో పొగాకు రైతులతో సమావేశమయ్యారు. పొగాకు గిట్టుబాటు దర కల్పనకు కృషి చేస్తామని హామీనిచ్చారు. ఆ తర్వాత కొయ్యలగూడెంలో ఏర్పాటు చేసిన మహిళా సదస్సులో పాల్గొన్నారు. వేలాదిగా తరలివచ్చిన మహిళలను చూసి బాబు ఆనందం వ్యక్తం చేశారు.
ఎక్కువ సమయం వారికి సంబంధించిన అంశాలు మాట్లాడడానికే ప్రాధాన్యం ఇచ్చారు. డ్వాక్రా సంఘాలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో లక్ష రూపాయల వరకు వడ్డీ లేని రుణాలను అందిస్తామని, ప్రత్యేక బ్యాంకును కూడా ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం ముగిశాక గురువారం సాయంత్రం హైదరాబాద్ బయల్దేరి వెళ్లారు.

తరలిన మహిళలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల జిల్లా పర్యటన ముగిసింది. తొలి రోజు రైతు సదస్సులో ప్రసంగించిన చంద్రబాబు వివిధ వర్గాల ప్రజల్లో భరోసా నింపుతూ అదే సమయంలో విభజన వల్ల ఏర్పడిన ఇబ్బందులను, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను, భవిష్యత్ పరిణామాలను వివరించారు.

చంద్రబాబు
మలిరోజు మహిళా సదస్సులో పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రాభివృద్ధిలో మహిళలు తమవంతు సాయం అందించాలని కోరారు.

చంద్రబాబు
తొలుత నరసన్నపాలెంలో, తర్వాత బయ్యనగూడెంలో మాట్లాడిన చంద్రబాబు అనంతరం కొయ్యలగూడెంలో పొగాకు రైతులతో సమావేశమయ్యారు. పొగాకు గిట్టుబాటు దర కల్పనకు కృషి చేస్తామని హామీనిచ్చారు.

చంద్రబాబు
ఆ తర్వాత కొయ్యలగూడెంలో ఏర్పాటు చేసిన మహిళా సదస్సులో పాల్గొన్నారు. వేలాదిగా తరలివచ్చిన మహిళలను చూసి బాబు ఆనందం వ్యక్తం చేశారు.

చంద్రబాబు
ఎక్కువ సమయం వారికి సంబంధించిన అంశాలు మాట్లాడడానికే చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారు.

చంద్రబాబు
డ్వాక్రా సంఘాలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో లక్ష రూపాయల వరకు వడ్డీ లేని రుణాలను అందిస్తామని, ప్రత్యేక బ్యాంకును కూడా ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications