నోట్ల రద్దుపై రంగంలోకి చంద్రబాబు, ఆర్బీఐ గవర్నర్కు ఫోన్: ఏటీఎంలలో చిన్న నోట్లు!
అమరావతి: రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేపథ్యంలో దేశంలోలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సామాన్యుల సమస్యలను పరిష్కరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం రంగంలోకి దిగింది.
నోట్ల రద్దు పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్కు లేఖ రాశారు. అనంతరం ఆయనతో ఫోన్లో మాట్లాడారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్కు వివరించారు.

చంద్రబాబుకు లేఖకు ఆయన సానుకూలంగా స్పందించారు. నోట్ల రద్దు సమస్యను ఫోన్లో వివరించిన చంద్రబాబు.. ఆర్బీఐతో చర్చించేందుకు ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి రవిచంద్రను ముంబై పంపించారు.
ఏపీకి కొత్త రూ.500 నోట్లను తెచ్చే విషయమై ఆయన చర్చించనున్నారు. అలాగే, ఏటీఎంలలో రూ.20, రూ.50 నోట్లను కూడా అందుబాటులోకి తేవాలని ఈ సందర్భంగా చంద్రబాబు కోరినట్లుగా తెలుస్తోంది. నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే.
-
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
CSK vs RCB: ఓటమికి కారణమెవరంటే ? నిజాయితీగా చెప్పేసిన రుతురాజ్..! -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
పొంచి ఉన్న తుఫాన్ ముప్పు, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
నరసాపురం To అరుణాచలం, బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరే వేళ ఊహించని ట్విస్ట్..!! -
షాకిచ్చిన నటాషా.. హార్దిక్ లైఫ్లో ఊహించని ట్విస్ట్! -
గంటన్నారలో అమరావతి టు హైదరాబాద్, కేంద్రం కీలక నిర్ణయం..!!












Click it and Unblock the Notifications