Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అభివృద్దిలో కీలకం కానున్న ప్లైఓవర్‌కి బాబు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్: విజయవాడ నగరవాసుల ట్రాఫిక్ సమస్యలను తీర్చేందుకు కనకదుర్గగుడి వద్ద ప్లైఓవర్ నిర్మాణానికి అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రూ. 250 కోట్ల వ్యయంతో ఈ ప్లైఓవర్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేసి కేంద్రానికి పంపాలని అధికారులకు సూచించారు.

అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో జిల్లా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ, ఇతర
ఎమ్మేల్యేలతో సమావేశమై ప్లైఓవర్ నిర్మాణం గురించి చర్చించారు. ఈ ప్రాజెక్టు త్వరగా పూర్తి అవ్వాలంటే ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ నిరంతరం కేంద్రంతో సంప్రదింపులు జరపాలని సూచించారు.

 chandrababu gave the green signal to kanaka durga fly over

ఈ ప్లైఓవర్ నిర్మాణం చాలా అవసరం. కనకదుర్గగుడి వద్ద నిర్మించే ఈ ప్లైఓవర్ హైదరాబాద్ నుండి విజయవాడకు వచ్చే రహదారిలో ఉంది. అంతే కాదు విజయవాడని చంద్రబాబు నాయుడు తాత్కాలిక రాజధానిగా ప్రకటించారు. అభివృద్ధి కార్యక్రమాలకు వేదికగా విజయవాడను మరింత ముందుకి తీసుకెళ్లడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో శివరామకృష్ణన్ కమిటీ ఏర్పాటైన తరువాత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడ రాజధాని ఉంటే బాగుంటుంది, అక్కడ ఉన్న అనుకూల, ప్రతికూల అంశాలు ఏమిటన్న వివరాలతో నివేదికలు సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనలను శివరామకృష్ణన్ కమిటీకి కూడా సమర్పించింది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని సందర్భాల్లో విజయవాడ - గుంటూరు మధ్యలోనే రాజధాని అని కూడా ప్రకటించడంతోపాటు సహచరులకు కూడా ఇదే సంకేతాలు ఇప్పటికే పంపించిన విషయం తెలిసిందే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+