కేసీఆర్ వైఖరి: మౌనమేంటని బాబుని నిలదీసిన అంబటి
దీనిపై అంబటి మాట్లాడారు. వీటి ప్రభావం సీమాంధ్ర పైనే ఎక్కువగా పడుతుందన్నారు. సమస్యల పైన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అలా కాదంటే చంద్రబాబు కేంద్రం సాయాన్ని కోరాలని ఆయన అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం స్థానికత 1956 అని చెప్పడంపై చంద్రబాబు ఏమీ మాట్లాడటం లేదని మండిపడ్డారు. ఫీజు రీయింబర్సుమెంట్స్ పైన కూడా ఆయన వైఖరి అలాగే ఉందని ఆరోపించారు. అంతేకాకుండా హైదరాబాదులోని పలు ముఖ్య ఆసుపత్రులలో సీమాంధ్రులకు ట్రీట్మెంట్ నిరాకరిస్తున్నారని, చంద్రబాబు ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు.
ఎంసెట్ కౌన్సెలింగ్ పైన సుప్రీం కోర్టు ఆదేశాలను తాము స్వాగతిస్తున్నామని అంబటి చెప్పారు. తనకు పరిపాలనలో ఎంతో అనుభవం ఉందని చెప్పే చంద్రబాబు సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు. విభజన వల్ల ఏపీ రైతులు, విద్యార్థులు చివరకు పేషెంట్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వీటి పైన బీజేపీ, కాంగ్రెసు, టీడీపీలు స్పందించాలన్నారు.