రామ్మూర్తి నాయుడు మరణంపై చంద్రబాబు తీవ్ర ఆవేదన.. సోదర వియోగంపై పవన్ కళ్యాణ్!
తన తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు మరణం పైన ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు స్పందించారు. నేడు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లవలసిన నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు ఆసుపత్రిలో విషమ పరిస్థితుల్లో ఉన్నాడని తెలియడంతో అర్ధాంతరంగా పర్యటనను రద్దు చేసుకొని నేరుగా హైదరాబాద్ లోని ఏఐజి ఆసుపత్రికి వెళ్లారు.
సోదరుడి మరణంపై చంద్రబాబు ఏమన్నారంటే
సోదరుడి మరణంతో తీవ్ర దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు. రామ్మూర్తి నాయుడు నన్ను విడిచి వెళ్లిపోయాడని శోకతప్త హృదయంతో తెలియజేస్తున్నానని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రజాజీవితంలో పరిపూర్ణ మనసుతో ప్రజలకు సేవ చేశాడని ఆయన వెల్లడించారు. తమ నుండి దూరమై కుటుంబంలో విషాదం నింపాడని పేర్కొన్నారు. రామ్మూర్తి నాయుడు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను అని చంద్రబాబు వివరించారు.

నా తమ్ముడు, చంద్రగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మనల్ని విడిచి వెళ్లిపోయాడని బాధాతప్త హృదయంతో అందరికి తెలియచేస్తున్నాను. రామ్మూర్తి నాయుడు ప్రజా జీవితంలో పరిపూర్ణ మనసుతో ప్రజలకు సేవలు అందించిన నాయకుడు. మా నుంచి దూరమైన మా సోదరుడు మా కుటుంబంలో ఎంతో విషాదాన్ని… pic.twitter.com/uZElKIo85x
— N Chandrababu Naidu (@ncbn) November 16, 2024
బాబాయ్ మరణం కుటుంబంలో తీవ్ర విషాదం నింపిందన్న లోకేష్
మరోవైపు చిన్నాన్న మృతి పట్ల మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తన చిన్నాన్న మరణం తమ కుటుంబంలో తీవ్ర విషాదం నింపిందని లోకేష్ పేర్కొన్నారు. పిన్ని తమ్ముళ్లు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నానని లోకేష్ తెలిపారు. రామ్మూర్తి నాయుడు మృతి పట్ల చంద్రబాబుకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్.
చిన్నాన్న నారా రామ్మూర్తి నాయుడు గారి మృతి తీవ్ర విషాదం నింపింది. చిన్నాన్నతో చిననాటి నా అనుబంధం కళ్ల ముందు కదిలి వచ్చిన కన్నీటితో నివాళులు అర్పిస్తున్నాను. మౌనమునిలా మారిన చిన్నాన్న ఇన్నాళ్లూ మాకు కంటికి కనిపించే ధైర్యం..నేటి నుంచి చిరకాల జ్ఞాపకం. చిన్నాన్న ఆత్మకు… pic.twitter.com/5kXf2JkyAa
— Lokesh Nara (@naralokesh) November 16, 2024
సోదర వియోగంతో బాధపడుతున్న చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ సానుభూతి
ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు ఆత్మకు శాంతి చేకూరాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నట్టు తెలిపారు. సోదర వియోగంతో బాధపడుతున్న చంద్రబాబుకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో ఉండడం వల్ల రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలకు తాను హాజరు కాలేకపోతున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
శ్రీ నారా రామ్మూర్తి నాయుడు గారి ఆత్మకు శాంతి చేకూరాలి!
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) November 16, 2024
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి సోదరుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీ నారా రామ్మూర్తి నాయుడు గారి మరణించారని తెలిసి చింతిస్తున్నాను. శ్రీ రామ్మూర్తి నాయుడు గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. సోదర వియోగంతో…
రామ్మూర్తి నాయుడు మృతితో సంతాపం తెలుపుతున్న టీడీపీ మంత్రులు, నేతలు
రామ్మూర్తి నాయుడు కుమారుడు రోహిత్ కు, వారి కుటుంబ సభ్యులకు తన సంతాపాన్ని తెలుపుతున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.మరోవైపు రామ్మూర్తి నాయుడు మృతి పట్ల టిడిపి మంత్రులు, నేతలు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు, మంత్రులు కొల్లు రవీంద్ర, గొట్టిపాటి రవి, అనగాని సత్యప్రసాద్, డిబివి స్వామి, అచ్చెన్నాయుడు, నారాయణ తమ ప్రగాఢ సానుభూతిని, దిగ్బ్రాంతిని తెలియజేశారు .












Click it and Unblock the Notifications