వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పన్ను తగ్గింపు: ఏపీ వాహనదారులకు చంద్రబాబు శుభవార్త, భారం రూ.1120కోట్లు

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఏపీ వాహనదారులకు చంద్రబాబు శుభవార్త

అమరావతి: రాష్ట్రంలోని వాహనదారులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త అందించారు. విపరీతంగా పెరిగిన పెట్రోల్, డీజిల్‌పై పన్ను తగ్గించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు.

<strong>మంత్రినే హత్య చేస్తామంటారా?: జగన్ పార్టీ నేత వసంతకు బాబు హెచ్చరిక, ఆడియో టేప్, కేసు</strong>మంత్రినే హత్య చేస్తామంటారా?: జగన్ పార్టీ నేత వసంతకు బాబు హెచ్చరిక, ఆడియో టేప్, కేసు

డీజిల్, పెట్రోల్‌పై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న పన్నులో లీటర్‌కు రూ.2 తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాష్ట్ర ఖజానాపై భారం పడే అవకాశం ఉంది. కాగా, ప్రస్తుతం వ్యాట్ రూపంలో రూ.4 వసూలు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. తగ్గించిన ధరలు మంగళవారం ఉదయం నుంచి అమల్లోకి రానున్నాయి.

chandrababu naidu wish to reduce excise duty Rs. 2 on litre petrol and diesel

కాగా, పన్ను తగ్గింపుపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటన చేశారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపునకు సంబంధించి రాష్ట్ర సర్కార్ తన ఎక్సైజ్ డ్యూటీ నుంచి 2శాతం మేర పన్ను తగ్గించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాపై రూ.1120 కోట్ల మేర భారం పడనుంది.

రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్రో ధరల పెరుగుదలను నిరసిస్తూ విపక్షాలన్నీ కలిసి సోమవారం భారత్ బంద్ చేపట్టాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బంద్ విజయవంతం కాగా, ఇతర రాష్ట్రాల్లో పాక్షికంగా కొనసాగింది.

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu on Monday wished that to reduce excise duty Rs. 2 on litre petrol and diesel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X