ప్రతిసారి కొత్త విషయం తెలుసుకుంటున్నా: బాబు, ఏపీలో 'హీరో' పెట్టుబడి
అమరావతి: తాను దావోస్ వచ్చిన ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయం తెలుసుకుంటున్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం నాడు అన్నారు. నైపుణ్యం గల మానవవనరులు ఏపీ సొంతం అని చెప్పారు.
ఏపీలో మిగులు విద్యుత్తో పాటు పుష్కలంగా నీరు, వనరులు ఉన్నాయని చెప్పారు. ఏపీ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని చెప్పారు. ఏపీలో సంక్షేమ, ఉపాధి అవకాశాలను గణనీయంగా పెంచామని చెప్పారు. తాను ఇప్పటికి పదిసార్లు దావోస్ వచ్చానని చెప్పారు.

చంద్రబాబుతో హీరో గ్రూప్ ప్రతినిధి భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హీరో గ్రూప్ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఏపీలో ప్లాంటు ఏర్పాటు చేస్తామని వారు చెప్పారు. త్వరలో శంకుస్థాపన తేదీని ప్రకటిస్తామని హీరో గ్రూప్ ప్రతినిధులు వెల్లడించారు.
సీఆర్డీఏ అధికారులకు షాక్
తుళ్లూరు, మందడం, నెక్కల్లులో మాస్టర్ పాలన్ పైన సిఆర్డీఏ అధికారులు రైతులతో సమావేశం నిర్వహించారు. అధికారులకు రైతులు షాకిచ్చారు. గ్రామ కంఠాల పైన స్పష్టత ఇవ్వాలని నిలదీశారు. దీంతో తుళ్లూరులో సభ నిలిచిపోయింది.












Click it and Unblock the Notifications