Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సోషల్ పోస్టులపై ఏపీ సర్కార్ కొరడా..! త్వరలో చట్టం, నిజ నిర్ధారణ కమిటీ..!

ఏపీలో రాజకీయ పార్టీల మధ్య నెలకొన్న పోరుకు సోషల్ మీడియా కేంద్రంగా మారుతోంది. అధికారంలో ఉన్న పార్టీలకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష పార్టీలు తప్పుడు ప్రచారాల్ని తెరపైకి తీసుకురావడం ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. ఇప్పుడు అలాంటి సోషల్ ప్రచారాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రజలకు వాస్తవాలు తెలిసేందుకు ఓ నిజ నిర్ధారణ కమిటీని కూడా ఏర్పాటు చేస్తోంది.

సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించి అభద్రతా భావానికి గురిచేసే వారిపై ఇకపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుందని, దీనిపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక చట్టాన్ని కూడా తెస్తామని హోంమంత్రి అనిత ప్రకటించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పధకాలను చూసి ఓర్వలేక సోషల్ మీడియాలో విషం చిమ్ముతూ వాస్తవాలను అవాస్తవాలుగా చిత్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించడమే గాక అభధ్రతా భావానికి గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇకపై అలాంటి దుష్ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్టం తెస్తామన్నారు.

Chandrababu regime plans legislation to curb misleading social posts fact finding panel also

దీంతో పాటు ప్రత్యేకంగా ఒక నిజ నిర్ధారణ కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసి వాస్తవాలేమిటో ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తుందని హోంమంత్రి అనిత ప్రకటించారు. అమరావతి మునిగిపోయిందని విజయవాడ ప్రకాశం బ్యారేజి గేట్లు పనిచేయడం లేదని పలు అసత్య ప్రచారాలను సోషల్ మీడియాలో ఇష్టారీతిన ప్రసారం చేస్తూ ప్రభుత్వంపై మూకుమ్మడి దాడి చేస్తున్నారని, ఇకపై అలాంటి తప్పుడు వార్తల ప్రసారాలను సమర్ధవంతంగా తిప్పకొట్టడంతోపాటు అందుకు కారకులపై చట్టప్రకారం చర్యలు తీసుకోనున్నట్టు అనిత తెలిపారు.

Chandrababu regime plans legislation to curb misleading social posts fact finding panel also

కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలన్నీ విజయవంగా అమలు చేయడంతో ప్రతిపక్షపార్టీ తట్టులేక పోతోందని అందుకే సోషల్ మీడియా వేదికగా దుప్ప్ర్రచారాన్ని చేస్తోందని హోం మంత్రి అనిత మండిపడ్డారు. ఇది ఆపార్టీకి వారసత్వంగా వచ్చిన సమస్యగా ఉందన్నారు. ఒక్క ఆగష్టు నెలలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ,నేతన్నలకు,నాయి బ్రాహ్మణులకు 200 వరకూ ఉచిత విద్యుత్,స్త్రీశక్తి పధకం కింద మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించామన్నారు. అసాంఘిక శక్తులను ఎలా అరికట్టాలో చంద్రబాబుకు బాగా తెలుసని అలాంటి శక్తులపై ఉక్కుపాదం మోపుతామన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+