పప్పు-లోకేష్: 'బాబు గూగుల్ను మూయిస్తారా?, జేసీ అక్కడ ఉమ్మేస్తున్నారు'
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టిడిపి నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి శుక్రవారం నాడు తీవ్రంగా మండిపడ్డారు.
విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టిడిపి నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి శుక్రవారం నాడు తీవ్రంగా మండిపడ్డారు.
ఏపీలో సోషల్ మీడియాను నిషేధించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. సోషల్ మీడియాలో విమర్శలు తట్టుకోలేక అణచివేస్తున్నారని దుయ్యబట్టారు.
గూగుల్లో పప్పు అని టైప్ చేస్తే నారా లోకేష్ ఫోటో వస్తోందని, మరి అలాంటప్పుడు గూగుల్ను చంద్రబాబు మూయించివేస్తారా అని ప్రశ్నించారు.ఫిఫ్త్ ఎస్టేట్గా మారిన సోషల్ మీడియా అంటే చంద్రబాబు వణికిపోతున్నారన్నారు.

చంద్రబాబు ప్రభుత్వం ప్రజల గొంతుకకు సంకేళ్లు వేస్తోందన్నారు. అన్యాయాన్ని సోషల్ మీడియాలో ఖండిస్తే జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. భావప్రకటన స్వేచ్ఛను హరించివేస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలు తగినరీతిలో బుద్ధి చెబుతారన్నారు. సీఎం చంద్రబాబు కులాల కుంపటి రాజేసి రాక్షస ఆనందాన్ని పొందుతున్నారన్నారు. సొంత పార్టీ నాయకులను ఇతర నేతలతో తిట్టిస్తున్నారన్నారు.
జేసీ దివాకర్ రెడ్డిపై భూమన నిప్పులు
జేసీ దివాకర్ రెడ్డి వాడేదీ రాక్షస భాష అని భూమన అన్నారు. ఆయన వాడే భాషను ఎవరూ హర్షించరని చెప్పారు. జగన్పై జేసి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. జేసీ వ్యాఖ్యలు రాయలసీమ భాషను అవమానించేలా ఉన్నాయన్నారు. వ్యక్తిగత లాభం కోసం సూర్యుడిపై జేసీ ఉమ్మేస్తున్నారన్నారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications