చిరంజీవి-మోహన్ బాబు ఒకే వేదిక మీదకు : సీఎం జగన్ నిర్ణయాలపై: కలుస్తారా - విభేదిస్తారా..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక కీలక భేటీకి రంగం సిద్దమైంది. మెగాస్టార్ చిరంజీవి.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒకే వేదిక మీదకు రానున్నారు. ఒకే అంశం పైన మాట్లాడనున్నారు. ఇందుకు ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ వేదిక కానుంది. తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారానికి ఎట్టకేలకు అన్ని విభాగాలు ఒక్కతాటిపైకి వచ్చే ప్రయత్నానికి ఈ సమావేశం నాంది కానుంది.
ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కీలక సమావేశం జరగనుంది. కరోనా సమయంలో ఇండస్ట్రీ ఎదుర్కొన్న అనేక ఆటంకాలతో పాటు ఇటీవల తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు జారీ చేసిన జీవోలు, సినీ కార్మికుల సంక్షేమం తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం.

ఆ ఇద్దరి పైన ఫోకస్
ఫిలిం ఛాంబర్లోని అన్ని సంఘాలకు సంబందించిన దాదాపు 200 మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా. సినీ పెద్దలు చిరంజీవి, మోహన్ బాబు, మురళీ మోహన్, తమ్మారెడ్డి భరద్వాజలతో పాటు మా అధ్యక్షుడు మంచు విష్ణు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఫిల్మ్ ఛాంబర్లోని ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ , డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ , స్టూడియో సెక్టార్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ , ఫిల్మ్ ఫెడరేషన్ , డైరెక్టర్స్ అసోసియేషన్ సహా అన్ని సంఘాలను సమావేశానికి ఆహ్వానించారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్తో చిరంజీవి భేటీ కంటే ముందు ఈ సమావేశం జరగాల్సి ఉండగా రెండుసార్లు వాయిదా పడింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం సినీ పరిశ్రమ సమస్యలు, ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందిస్తూ ఈ నెలాఖరులో ఉత్తర్వులు జారీ చేయనున్న క్రమంలో ఈ సమావేశం కీలకంగా మారింది.

ఆహ్వానాలపై చర్చ ఉంటుందా
మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమ అంశాల పైన ఒక సారి పర్సనల్ గా సీఎం జగన్ తో సమావేశమయ్యారు. ఆ సమయంలో తనను ఆహ్వానిస్తేనే.. వచ్చానని చెప్పుకొచ్చారు. ఇక, సినీ హీరోలు మహేష్ బాబు.. ప్రభాస్ తో పాటుగా కొరటాల శివ.. రాజమౌళితో..నారాయణ మూర్తితో కలిసి మరోసారి సీఎం జగన్ తో భేటీ అయ్యారు.
ఆ సమయంలో సినీ పరిశ్రమ అంశాల పైన సీఎం హామీ ఇచ్చారని..అన్ని అంశాలకు పరిష్కారం దొరికిందని సమావేశంలో పాల్గొన్న హీరోలు చెప్పుకొచ్చారు. సమావేశ వివరాలను ఇండస్ట్రీ పెద్దలకు వివరించేందుకు సమావేశం ఏర్పాటు చేస్తామని చిరంజీవి అప్పట్లోనే చెప్పారు. దీనికి అనుగుణంగా ఈ రోజు సమావేశంలో సీఎంతో జరిగిన చర్చలు..నిర్ణయాల గురించి చిరంజీవి వివరించనున్నారు.

కలుస్తారా...విభేదిస్తారా
అయితే, మోహన్ బాబు కు సైతం సీఎం తో సమావేశానికి ఆహ్వానం ఉందని..కానీ, ఆ విషయాన్ని కొందరు తన తండ్రికి చెప్పలేదని..ఎవరు అలా చేసారో కూడా తమకు తెలుసంటూ మంచు విష్ణు వ్యాఖ్యానించారు. మరి..ఈ సమావేశంలో ఆ అంశాన్ని ప్రస్తావిస్తారా లేదా అనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఇప్పటికే ప్రభుత్వం నియమించిన కమిటీ సైతం ఫిలిం ఛాంబర్ ప్రతినిధులతో పాటుగా పలువరితో అభిప్రాయ సేకరణ చేసి నివేదిక సిద్దం చేసింది.
దీనిని ముఖ్యమంత్రి జగన్ కు సమర్పించనుంది. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం సినీ పరిశ్రమ అంశాల పైన తుది నిర్ణయం తీసుకోనుంది. దీనికి ముందుగా జరగుతున్న ఈ సమావేశంలో సీఎం సమక్షంలో జరిగిన నిర్ణయాల పైన చిరంజీవి వివరించి..ఇండస్ట్రీ పెద్దల అభిప్రాయాలను సేకరించనున్నారు.
Recommended Video

సమావేశం పై ఆసక్తి
వాటిని మరోసారి సీఎంతో సమావేశమై వివరించి..తుది ఉత్తర్వులు వచ్చే విధంగా వ్యవహరించనున్నట్లుగా తెలుస్తోంది. అయితే, సీఎంతో చిరంజీవి జరిపిన చర్చల్లోని అంశాలతో ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం సమావేశం అవుతున్న వేళ... ఎందరు వాటిని అంగీకరిస్తారు.. ఎంత మంది విభేదిస్తారు... అసలు ఈ సమావేశంలో ఏం జరుగుతుంది.. ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనే ఉత్కంఠ ఇప్పుడు టాలీవుడ్ తో పాటుగా రాజకీయంగానూ ఆసక్తి పెంచుతోంది.
-
2001 సంక్రాంతికి చిరు - బాలయ్య అభిమానుల మధ్య హోరాహోరీ యుద్ధం! -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..??












Click it and Unblock the Notifications