జాక్ పాట్ కొట్టిన చిత్తూరు రైతు, 45 రోజుల్లో రూ. 4 కోట్లు సంపాదన, అప్పులు క్లోజ్ !
చిత్తూరు/కోలారు: దేశవ్యాప్తంగా టమాటా ధరలు విపరీతంగా పెరిగాయి. ఒకవైపు వినియోగదారుల జేబులకు చిల్లులు పెడితే మరోవైపు టమోటా రైతులకు జాక్పాట్ తగిలింది. రెండు నెలల్లో ఆంధ్రా, కర్ణాటక రైతులు కోట్లకు పడగలెత్తినట్లు టమాటా మార్కెట్ యార్డుల నుంచి సమాచారం వచ్చింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని మనదపల్లె, కర్ణాటకలోని కోలార్ మార్కెట్ లో టమాటకు విపరీతమైన డిమాండ్ ఉండడంతో ఆ పరిసర ప్రాంతాల రైతులు భారీగా లాభాలు గడిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాకు చెందిన మురళి (48) అనే రైతు ఒకటిన్నర నెలలో నాలుగు కోట్లు డబ్బు సంపాదించాడు. రైతు కుమారుడైన మురుళి తొలిసారిగా టమోటాల ద్వారా భారీ మొత్తంలో డబ్బు సంపాదించినట్లు'టైమ్స్ ఆఫ్ ఇండియా'పేర్కొంది. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం మురళి కేవలం 45 రోజుల్లోనే రూ.4 కోట్లకు పై టమాటాలు విక్రయించి డబ్బు సంపాదించాడు.

తాను పండించిన టమోటాలను కర్ణాటకలోని కోలార్లోని మార్కెట్కు పంపుతుంటానని మురళి చెప్పాడు. కోలారులోని ఏపీఎంసీ యార్డులో మంచి ధర లభిస్తుండడంతో కోలార్లో టమాట విక్రయిస్తున్నారు. మరళి స్వగ్రామానికి కోలార్ దాదాపు 130 కి.మీ దూరం ఉంది. మదనపల్లె మార్కెట్, చిత్తూరు జిల్లాలోని పలమనేరు టామాటా మార్కెట్ లో కూడా టమాటాలకు భారీ డిమాండ్ ఉంది. అయితే కోలారు ఏపీఎంసీకి టమాటా తెచ్చి అమ్మేందుకు మురళి చాలా దూరం ప్రయాణిస్తున్నాడు.
టైమ్స్ ఆఫ్ ఇండియాతో మురళి మాట్లాడుతూ గత ఎనిమిదేళ్లుగా టమాటా సాగు చేస్తున్నానని, ఈ ఏడాది మాత్రం టామాటాలకు ఇలాంటి డిమాండ్ వచ్చిందని, గతంలో టమాటాలు ఇంత ధరలు పలకలేదని అన్నారు. ఈ సంవత్సరం తాను వేసిన టమాటాలు అదృష్టాన్ని తెచ్చిపెట్టిందని మరళి అంటున్నారు. చిత్తూరు జిల్లాలోని కరకమండలం గ్రామంలో మురళి ఉమ్మడి కుటుంబానికి వారసత్వంగా 12 ఎకరాల భూమి వచ్చింది.
కొన్నేళ్ల క్రితం అదనంగా మురళి మరో 10 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. గతేడాది జులైలో ధరల పతనంతో అతని కుటుంబం తీవ్రంగా నష్టపోయింది. విత్తనాలు, ఎరువులు, కూలీలు, రవాణా, ఇతర లాజిస్టిక్స్పై పెట్టుబడి పెట్టి సుమారు రూ.1.5 కోట్ల అప్పులు చేశాడు. అయితే, ఈసారి మాత్రం మురళిని అదృష్టం వరించింది. ఈ ఏడాది పంట నాణ్యంగా ఉండడంతో ఇప్పటివరకు 45 రోజుల్లో 35 సార్లు టమాటాలు కోసి విక్రయించాడ.

ఇంకా 15 నుంచి 20 రోజుల వరకు పండే అవకాశం ఉందని మురళి తెలిపారు. మురళి కొడుకు ఇంజినీరింగ్, ఆమన కూతురు మెడిసిన్ చదువుతున్నారు. అప్పులన్నీ తీర్చినా 45 రోజుల్లో అన్ని ఖర్చులు పోను రూ. 2 కోట్లు ఆదా చేశానని మురళి అంటున్నాడు. టమాటాల్లో వచ్చిన లాభాలతో మురళి ఇప్పుడు భూమి కొనే ఆలోచనలో ఉన్నాడు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పెద్ద ఎత్తున వ్యవసాయం చెయ్యాలని నా కోరిక అని మురళి అంటున్నాడు.
టమాటాల్లో వచ్చిన లాబాలతో తమ గ్రామంలో దాదాపు 20 ఎకరాల భూమిని కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నానని మురళి అంటున్నాడు. పంట నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులందరికీ ఆయన కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. వ్యవసాయాన్ని నమ్ముకున్న వాడు ఎప్పటికీ పోరాటాన్ని ఆపలేడని, ఎప్పటికైనా నమ్ముకున్న భూమాత రైతులను ఆదుకుంటుందని మురళి అంటున్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications