అంత జరిగితే నాకు చెప్పరా, అనవసర వివాదం - చంద్రబాబు ఆగ్రహం..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. తాజాగా ఇండిగో విమానాల వివాదం పైన ఒక జాతీయ ఛానల్ లో జరిగిన చర్చ.. తదనంతరం పరిణామాల పైన చంద్రబాబు ఆరా తీసారు. కేంద్ర పరిధిలోని విమానాల అంశం మనకు ఎందుకని ప్రశ్నించారు. పార్టీ లైన్ అధికార ప్రతినిధు లకు కరెక్టగా రావటం లేదని అసహనం వ్యక్తం చేసారు. ఇంత జరుగుతుంటే తనకు ఎందుకు చెప్ప లేదని ప్రశ్నించిన చంద్రబాబు..ఇక నుంచి పూర్తి కసరత్తుతోనే చర్చల్లో పాల్గొనాలని తేల్చి చెప్పారు. పార్టీ నేతలకు కీలక దిశా నిర్దేశం చేసారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతల పైన అసహనం వ్యక్తం చేసారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం సంబంధం లేని విమానాల విషయంలో ఒక జాతీయ ఛానల్ లో జరిగిన చర్చ.. తరువాత వివాదం పైన స్పందించారు. అనవసర వివాదాన్ని తెచ్చుకున్నామని అభిప్రాయపడ్డారు. వివాదం పెద్దదయ్యే వరకూ తనకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.

చర్చకు మరింత కసరత్తుతో వెళ్లి సమయ స్పూర్తితో వ్యవహరించి ఉండాల్సిందని పేర్కొన్నారు. చిన్న విషయాన్ని పెద్దది చేసారని ..ఛానల్ ను బహిష్కరిస్తున్నామని చెప్పటం ద్వారా మరింత వివాదం చేసారని సీఎం చంద్రబాబు అసమనం వ్యక్తం చేసారు. పార్టీ లైన్, ప్రభుత్వ విధానాల పై అధికార ప్రతినిధుల కు మార్గదర్శకం చేయటంలో వైఫల్యం కనిపిస్తుందని పేర్కొన్నారు.
తీయ, రాష్ట్ర స్థాయిలో జరిగే తాజా పరిణామాలపై పార్టీ అధికార ప్రతినిధులు పూర్తి అవగాహన కలిగి మాట్లాడాలని సీఎం చంద్రబాబు సూచించారు. జాతీయ అంశాలపై మాట్లాడే సమయంలో జాగ్రత్తగా లేకుంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఇటీవల చూశామని వ్యాఖ్యానించారు. తాజా పరిణామాలపై ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలని, దానిలో మన పాత్ర ఎంత వరకు అనేది తెలుసుకోవాలని సూచించారు.
బీజేపీ నాయకులు ఏదైనా అంశంపై మాట్లాడాల్సి వస్తే.. జాతీయ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఒకే లైన్లో మాట్లాడతారని, మన పార్టీ నాయకులూ అదే తరహాలో స్పందించాలని నిర్దేశించారు. ఒక అంశంపై మన పార్టీ లైన్ ఏమిటి? ప్రభుత్వ విధానం ఏమిటి? ఆ అంశంలో మన పాత్ర ఎంత వరకు ఉంటుంది? అనే విషయాలపై కనీస అవగాహన లేకుండా మాట్లాడవద్దని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీతో కలిసి పనిచేస్తున్నామని, అదే సమయంలో ఎవరి పరిధి ఏమిటనే దానిపై పూర్తి అవగాహనతో ముందుకెళ్తున్నామని సీఎం పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications