Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబు కొత్త ప్రయోగం..! కలెక్టర్ల సదస్సులో ఇలా తొలిసారి..!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈసారి కూటమి సర్కార్ ను నడిపించడంలో పలు కొత్త విధానాలను అమలు చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఎంతో విన్నూత్నంగా చొరవ తీసుకుని మరీ ప్రయోగాలు చేసేందుకు వెనుకాడటం లేదు. ఇదే క్రమంలో ప్రస్తుతం అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులోనూ చంద్రబాబు మరో కొత్త ప్రయోగం చేశారు. రొటీన్ కు భిన్నంగా చంద్రబాబు చేసిన ఈ ప్రయోగంపై అధికారులు చర్చించుకుంటున్నారు.

అమరావతిలో జరుగుతున్న 5వ కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం చంద్రబాబు ఈసారి కొత్త విధానం పాటిస్తున్నారు. వివిధ జిల్లాల్లో కలెక్టర్లు అమలు చేస్తున్న విజయవంతమైన విధానాల్ని సీఎం చంద్రబాబు.. ఆయా జిల్లాల కలెక్టర్లతోనే ప్రజెంటేషన్ ఇప్పిస్తున్నారు. ఇలా ఆరు జిల్లాల కలెక్టర్లు ప్రదర్శించిన బెస్ట్ ప్రాక్టీసెస్ ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని కూడా చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలో పలు జిల్లాల కలెక్టర్లు ప్రదర్శించిన కొన్ని ప్రాజెక్టులు దేశానికే ఆదర్శంగా ఉన్నాయంటూ కితాబిచ్చారు. రోటీన్ గా కాకుండా ప్రజలకు ఉపయోగపడేలా కలెక్టర్ల కాన్ఫరెన్సులో చర్చ జరిగినందుకు ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వివిధ అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన అల్లూరి, పార్వతిపురం మన్యం, ఏలూరు, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల కలెక్టర్లను ఆయన అభినందించారు.

CM Chandrababu Naidu champions peer learning Collectors to present best practices at conference

ఇందులో విద్యార్థుల్లో ప్రతిభను ప్రొత్సహించేలా రూపొందించిన ప్రాజెక్ట్ నిర్మాణ్ గురించి వివరించిన అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, విద్యార్థులు పరిశుభ్రత, హైజినీక్ కండిషన్స్ పాటించేలా రూపొందించిన ముస్తాబు కార్యక్రమాన్ని ప్రజెంట్ చేసిన పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, నాటుసారా తయారీదారుల జీవితాల్లో మార్పు తెస్తూ.. వారిని మైక్రో ఎంటర్ ప్రెన్యూర్లుగా తీర్చిదిద్దేలా రూపొందించిన ప్రాజెక్ట్ మార్పు కార్యక్రమాన్ని ప్రజెంట్ చేసిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వీ, రైతుల్లో సాధికారత, ఆర్థిక లబ్ది, వ్యవసాయంలో ఉత్తమ విధానాల పాటించేలా రూపొందించిన ఛాంపియన్ ఫార్మర్స్ కార్యక్రమాన్ని వివరించిన నెల్లూరు జిల్లా హిమాన్షు శుక్లా ఉన్నారు.

CM Chandrababu Naidu champions peer learning Collectors to present best practices at conference

అలాగే విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన పౌష్టికాహారాన్ని మధ్యాహ్నం భోజనంలో అందించేందుకు ఏర్పాటు చేసిన స్మార్ట్ కిచెన్లపై ప్రజెంటేషన్ ఇచ్చిన కడప కలెక్టర్ సీహెచ్ శ్రీధర్, రెవెన్యూ రికార్డుల ట్యాంపర్ చేయకుండా చేపట్టిన డిజిటలైజేషన్ విధానం, ఏఐ వినియోగంపై రూపొందించిన ప్రాజెక్టును ప్రజెంట్ చేసిన అనంతపరం జిల్లా కలెక్టర్ ఆనంద్ ఉన్నారు. వచ్చే కలెక్టర్ల సమావేశం నాటికి ప్రజలకు ఉపయోగపడే మరిన్ని వినూత్న ఆలోచనలు, కార్యక్రమాలతో రావాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+