కేవీపీకి మద్దతుపై సీఎం రమేష్ దాటవేత, హోదాకు ఓయూ విద్యార్థి మద్దతు
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీతోనే ప్రత్యేక హోదా సాధ్యమని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే దానిని సాధిస్తామని రాజ్యసభ టిడిపి ఎంపీ సీఎం రమేష్ బుధవారం నాడు పునరుద్ఘాటించారు. ప్రత్యేక హోదా పైన కాంగ్రెస్ పార్టీని నమ్మడానికి ఏమాత్రం వీల్లేదన్నారు.
చంద్రబాబు నాయకత్వంలో హోదా సాధిస్తామన్నారు. ప్రత్యేక హోదా సాధనకు తమ ప్రయత్నాలు కోనసాగుతాయన్నారు. రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్ర రావు పెట్టిన ప్రయివేటు బిల్లుపై మద్దతు ప్రశ్నకు సీఎం రమేష్ సమాధానాన్ని దాటవేశారు.

చలసాని దీక్ష విరమణ
ప్రత్యేక హోదా డిమాండుతో దీక్ష చేపట్టిన ఆంధ్రా మేధావుల ఫోరం నేత చలసాని శ్రీనివాస్ బుధవారం నాడు దీక్షను విరమించారు. మంత్రి పత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, వైసిపి నేత శివరామి రెడ్డి, కాంగ్రెస్ నేత మల్లాది విష్ణు తదితరులు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప జేశారు.
అనంతపురంలో దీక్ష చేపట్టిన చలసానిని ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాదులోని ఆసుపత్రికి తరలించారు. ఆయన దీక్షను కొనసాగించారు. బుధవారం నాడు విరమించారు. ఈ సందర్భంగా చలసాని శ్రీనివాస్ మాట్లాడారు.
ఈ నెల 18న భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. తన దీక్షకు ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు తెలిపిన సంఘీభావం సంతోషకరమన్నారు. కేంద్రం విభజన హామీలు అమలు చేయాల్సిందేనని, అప్పటి వరకు తాను పోరాడుతూనే ఉంటానని చెప్పారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications