వరద బాధితుల నుంచి పన్నుల వసూళ్లు..!!
విజయవాడ వరద నష్టం నుంచి స్థానికులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ప్రభుత్వం వారికి ఆర్దికంగా అండగా ఉంటామని ప్రకటించింది. ప్రతీ ఇంటికి పరిహారం అందిస్తామని హామీ ఇచ్చింది. విద్యుత్ బిల్లుల వసూళ్లు వాయిదా వేసింది. ఇదే సమయంలో విజయవాడ మున్సిపల్ అధికారులు పన్నుల వసూళ్లు మొదలు పెట్టారు. పెనాల్టీలు విధిస్తామని హెచ్చరిస్తున్నారు.
పన్నుల కోసం
వరదలతో విజయవాడ వాసులు కష్టాల్లో ఉన్నారు. ప్రభుత్వం వారంతా కోలుకొనే వరకూ అండగా ఉంటామని హామీ ఇచ్చింది. కానీ, విజయవాడ నగర పాలక సంస్థ తాజాగా తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అవుతోంది. 15 రోజుల్లో ఇంటి పన్ను రద్దు చెల్లించకపోతే పెనాల్టీ పడుతుందని మున్సిపల్ అధికారులు హెచ్చరిస్తున్నారు. వరద బాధితులకు ఇంటి పన్ను రద్దు చేయకపోగా, 15 రోజుల్లో చెల్లించకపోతే పెనాల్టీ పడుతుందని హెచ్చరించడం పైన స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో, వామపక్ష పార్టీల నేతలు ఈ నిర్ణయం పైన నిరసన వ్యక్తం చేసారు.

పెనాల్టీలు విధిస్తాం
వరద ప్రాంతాల్లో 2024 -25 సంవత్సరం ఇంటి పన్ను, ఇతర చార్జీలు పూర్తిగా రద్దు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబూరావు డిమాండ్ చేశారు. ప్రజలు వరద కష్టాల్లో ఉంటే సెప్టెంబర్ 30వ తేదీలోగా విజయవాడ నగర ప్రజలు ఆస్తి పన్ను (ఇంటి పన్ను), మంచినీటి, డ్రైనేజీ చార్జీలు, ఖాళీ స్థలాలపై పన్నులు చెల్లించాలని, లేనియెడల పెనాల్టీలు పడతాయని నగరపాలక సంస్థ ఇప్పుడు ప్రకటన విడుదల చేయటం గర్హనీయమన్నారు. విజయవాడ నగరంలో 32 డివిజన్లలో 2,70,000 కుటుంబాలకు పైగా, దాదాపు 8 లక్షల జనాభా వరదల్లో నీట మునిగారు. సర్వస్వం కోల్పోయారు.
వామపక్షాల నిరసన
విజయవాడ నగర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమయ్యిందని తెలిపారు. ప్రభుత్వం వారిని అన్ని విధాల ఆదుకోవాల్సిన సమయం ఇదన్నారు. నగరపాలక సంస్థ బాధితులకు తోడ్పాటు ఇవ్వాల్సిన ఈ సమయంలో పన్నుల వసూళ్లలో మునిగితేలటం అన్యాయమన్నారు. బాధితులను ఆదుకోవడంలో విజయవాడ నగర పాలక సంస్థ పాలకపక్షం, ప్రజాప్రతినిధులు పూర్తిగా మొహం చాటేసారన్నారు. బాధ్యతను విస్మరించారని మండిపడ్డారు. 2024- 25 సంవత్సరానికి సంబంధించి వరద బాధిత ప్రాంతాలలో ఆస్తి పన్ను, మంచినీరు, డ్రైనేజీ, ఖాళీ స్థలాల పన్ను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేసారు.
-
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
అతడు ఇప్పుడు పక్కా మెంటల్లీ టఫ్: రవిశాస్త్రి -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
భారత్ కు డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్.. -
ఫైనల్ వేళ టీమిండియాకు మాజీ కోచ్ హెచ్చరిక, అభిషేక్ బ్యాటింగ్ ఆర్డర్ ఇక..!! -
మీ పాత బంగారం చెల్లుతుందా? 2026 కొత్త నిబంధనలు ఇవే! -
EPF 2026 అమల్లోకి: డబ్బులు ఎన్నిసార్లు తీసుకోవచ్చో తెలుసా? -
T20 world cup Final: ఫైనల్ అభిషేక్ దే-తేల్చేసిన టీమిండియా హీరో..! -
ఇరాన్ పోరాటం వెనుక రహస్య ఆయుధం? యూఎస్-ఇజ్రాయెల్ కు చిక్కని సీక్రెట్..! -
జీహెచ్ఎంసీ వాసులకు బిగ్ న్యూస్.. వారి ఆస్తులు సీజ్ కు రంగం సిద్ధం! -
ఆ ఉద్యోగుల జీతాలు నిలిపివేత, ఐఏఎస్ ల నుంచి జిల్లా స్థాయి వరకు - నిర్ణయం వెనుక..!!












Click it and Unblock the Notifications