టీడీపీ పథకాలకు షరుతులు వర్తిస్తాయ్..?
ఏపీలో అధికారమే ధ్యేయంగా ఇరు పార్టీల అధినేతలు అడుగులు వేస్తున్నారు. తాము అమలు చేసిన సంక్షేమ పథకాలే తిరిగి అధికారంలోకి తీసుకువస్తాయని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా టీడీపీ, జనసేన , బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడి కలిసి వస్తున్నాయి. టీడీపీ, వైసీపీ పార్టీలు అధికారమే లక్ష్యంగా ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించాయి. వైసీపీ గతంలో అమలు చేసిన నవరత్నాలనే తిరిగి అమలు చేస్తామని ప్రకటించగా, టీడీపీ మాత్రం నవరత్నాలను మించిన పథకాలు ఇస్తామని హామీలు ఇచ్చింది.
అయితే రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే పథకాలను అమలు చేయాలంటే 1,65,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంత డబ్బులు ఖర్చు చేసి సంక్షేమ పథకాలను అమలు చేయడం సాధ్యం కాదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే మేనిఫెస్టోకు కొన్ని షరతులు ఉంటాయని తెలుస్తోంది. అమ్మవడి ప్రభుత్వ పాఠశాలలతో పాటు , ప్రెవైట్ పాఠశాల విద్యార్థులకు సైతం జగన్ సర్కార్ అందిస్తోంది. అయితే కూటమి ఒకవేళ అధికారంలోకి వస్తే..ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు మాత్రమే తల్లికి వందనం స్కీమ్ అమలు కానుందని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఈ పథకానికి తెల్ల రేషన్ కార్డ్ నిబంధన కూడా తప్పనిసరి చేస్తారని సమాచారం అందుతోంది. ఇక వైసీపీ అమలు చేస్తోన్న రైతు భరోసా పథకానికి ధీటుగా తీసుకువచ్చిన అన్నదాత స్కీమ్లో కూడా భారీగా కోతలు ఉంటాయని తెలుస్తోంది. ఇంట్లో ఎంతమందికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నా ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తింపు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారని తెలుస్తోంది. లబ్ధిదారుల సంఖ్యను సగానికి సగం తగ్గించేలా కూటమి ప్లాన్స్ ఉన్నాయని ఆ షరతుల గురించి చెబితే ఓట్లు రావని కూటమి నేతలు సైలెంట్గా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై కూటమి నేతలు క్లారిటీ ఇస్తే కానీ పథకాలపై ఉన్న అనుమానాలు తొలగిపోయేలా కనిపించడం లేదు.













Click it and Unblock the Notifications