తప్పుడు సమాచారంతోనే: కావూరి, యూటిని..: పనబాక
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇవ్వడం వల్లే రాష్ట్ర విభజన ప్రక్రియ కొనసాగుతోందని కేంద్ర జౌళిశాఖ మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. ఆయన శనివారం కృష్ణా జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాన్ని విభజించడం అనివార్యమని ఆయన అన్నారు.
జిల్లాలోని హనుమాన్ జంక్షన్లో రూ. 3కోట్ల 50లక్షల నిధులతో ఏర్పాటు చేస్తున్న పట్టుగూళ్ల పరిశ్రమ కేంద్రం నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. మెజార్టీ ప్రజలు హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని కోరుకుంటున్నట్లు కావూరి సాంబశివరావు అన్నారు.

హైదరాబాద్ను యూటీ చేయమని కోరతాం: పనబాక
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కుదరని పక్షంలో ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని, హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేయమని కోరతామని కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి పనబాక లక్ష్మి అన్నారు. విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడారు. భద్రాచలంను సీమాంధ్రలో ఉంచేందుకు ప్రయత్నిస్తామని ఆమె తెలిపారు. సీమాంధ్ర ప్రాజెక్టులు, అభివృద్ధిపై పోరాడతామని చెప్పారు.
ఈ నెల 18న కేంద్ర మంత్రుల బృందం ముందు సమైక్య వాదాన్ని వినిపిస్తామని, సీమాంధ్ర కేంద్ర మంత్రులంతా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు. అయితే హైదరాబాద్ను పదేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానించిందని పనబాక లక్ష్మి చెప్పారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications