కెసిఆర్ సమక్షంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల చేరిక(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వలసల జోరు కొనసాగుతోంది. తాజాగా సోమవారం, కాంగ్రెస్ ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనుకయ్య, అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, డాక్టర్ రాజేశ్వరరావు, వెంకట్రావు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైరా ఎమ్మెల్యే బానోత్ మదన్లాల్, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకురాలు లక్ష్మి తమ అనుచరులతో కలిసి టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. టిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు వారికి కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు.
బంగారు తెలంగాణ సాకారం కావడానికి టిఆర్ఎస్ మరింత పటిష్టం కావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కెసిఆర్ పునరుద్ఘాటించారు. అనంతరం మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్తో పాటు టిడిపి నేతలు ఎక్కువగా తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరినట్టు ప్రకటించారు. వీరిలో మార్కెట్ కమిటీల సభ్యులు, సర్పంచ్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు ఎక్కువగా ఉన్నారని, 1200 మంది కాంగ్రెస్ కార్యకర్తలున్నారని వివరించారు. పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు మాట్లాడుతూ.. పార్టీకి కార్యకర్తలే రథసారథులని అన్నారు.
హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ నిర్మాణానికి సిఎం కెసిఆర్కు అందరూ చేయూత నివ్వాలని, అన్ని పార్టీల్లోని తెలంగాణ వాదులు టిఆర్ఎస్లోకి రావాలని పిలుపునిచ్చారు. తాజా చేరికలతో ఖమ్మం జిల్లాలో టిడిపి ఖతం అయ్యిందని అన్నారు. పార్టీలో చేరిన ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధి కోసమే తాము టిఆర్ఎస్లో చేరినట్టు ప్రకటించారు. బిజెపి తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గవర్నర్పాలన ఉండాలని ఆ పార్టీ మేనిఫెస్టోలో పెట్టే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు.
టిఆర్ఎస్ అంటేనే తెలంగాణ గౌరవాన్ని పెంచే పార్టీ అని డిప్యూటీ సిఎం మహమూద్ అలీ అన్నారు.జగ్గారెడ్డి వంటి తెలంగాణ వ్యతిరేకికి బిజెపి టికెట్ ఇవ్వడం సిగ్గుచేటని అన్నారు. ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ మాట్లాడుతూ, గిరిజనుల అభివృద్ధికి పాటుపడుతున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పోచారం శ్రీనివాస్రెడ్డి, జోగురామన్న, చీఫ్ విప్ ఓదెలు, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు ఇంద్రకరణ్రెడ్డి, సోమారం సత్యనారాయణ, ఏనుగు రవీందర్రెడ్డి, ఎమ్మెల్సీలు సలీం, వెంకట్రావు, ఆమోస్, మాజీ ఎమ్మెల్యే చంద్రావతి తదితరులు పాల్గొన్నారు.

చేరికలు
తెలంగాణ రాష్ట్ర సమితిలోకి ఇతర పార్టీల నుంచి వలసల పరంపర కొనసాగుతోంది.

చేరికలు
తాజాగా సోమవారం, కాంగ్రెస్ ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనుకయ్య, అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, డాక్టర్ రాజేశ్వరరావు, వెంకట్రావు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైరా ఎమ్మెల్యే బానోత్ మదన్లాల్, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకురాలు లక్ష్మి తమ అనుచరులతో కలిసి టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

చేరికలు
టిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు వారికి కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు.

చేరికలు
బంగారు తెలంగాణ సాకారం కావడానికి టిఆర్ఎస్ మరింత పటిష్టం కావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కెసిఆర్ పునరుద్ఘాటించారు.

చేరికలు
అనంతరం మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్తో పాటు టిడిపి నేతలు ఎక్కువగా తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరినట్టు ప్రకటించారు.

చేరికలు
వీరిలో మార్కెట్ కమిటీల సభ్యులు, సర్పంచ్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు ఎక్కువగా ఉన్నారని, 1200 మంది కాంగ్రెస్ కార్యకర్తలున్నారని వివరించారు.

చేరికలు
పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు మాట్లాడుతూ.. పార్టీకి కార్యకర్తలే రథసారథులని అన్నారు.

చేరికలు
హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ నిర్మాణానికి సిఎం కెసిఆర్కు అందరూ చేయూత నివ్వాలని, అన్ని పార్టీల్లోని తెలంగాణ వాదులు టిఆర్ఎస్లోకి రావాలని పిలుపునిచ్చారు.

చేరికలు
తాజా చేరికలతో ఖమ్మం జిల్లాలో టిడిపి ఖతం అయ్యిందని అన్నారు. పార్టీలో చేరిన ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధి కోసమే తాము టిఆర్ఎస్లో చేరినట్టు ప్రకటించారు.

చేరికలు
బిజెపి తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గవర్నర్పాలన ఉండాలని ఆ పార్టీ మేనిఫెస్టోలో పెట్టే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు.

చేరికలు
టిఆర్ఎస్ అంటేనే తెలంగాణ గౌరవాన్ని పెంచే పార్టీ అని డిప్యూటీ సిఎం మహమూద్ అలీ అన్నారు.జగ్గారెడ్డి వంటి తెలంగాణ వ్యతిరేకికి బిజెపి టికెట్ ఇవ్వడం సిగ్గుచేటని అన్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications