కరోనా కారణం అని లేఖ .. రాజమండ్రిలో దంపతుల మృతి పై అనుమానాలు
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించినా కరోనా వైరస్ పై మాత్రం ప్రజల్లో రోజురోజుకు భయం పెరిగిపోతోంది. ఎవరు తుమ్మినా దగ్గినా కరోనా వైరస్ అన్న భయం ప్రజలను వేధిస్తోంది. ఇక కరోనా భయంతో కర్ణాటక లో ఒక వ్యక్తి సూసైడ్ చేసుకోగా నేడు రాజమండ్రిలో దంపతులు అనుమానాస్పదంగా మృతి చెందారు .

రాజమండ్రిలో దంపతులు అనుమానాస్పద మృతి
అసలు విషయానికి వస్తే రాజమండ్రిలో దంపతులు అనుమానాస్పద మృతి చెందారు . సంఘటనా స్థలంలో వారు రాసిన లేఖలో కరోనా రావటం వల్ల తాము చనిపోతునట్టు రాసి మరీ మృతి చెందారు. ఇక సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు . రాజమండ్రి పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ గా పని చేసే రమేష్, వెంకట లక్ష్మి దంపతులు సగం కాలిన దేహాలతో చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

కరోనా వచ్చిందని సూసైడ్ నోట్ .. దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఇక స్థానికుల కథనం ప్రకారం వారికి చాలా కాలంగా ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయని , వారు ఏ కారణంతో ఆత్మహత్యకు పాల్పడ్డారో తెలీదని అంటున్నారు. అయితే సంఘటనా స్థలంలో దొరికిన ఒక బ్యాగ్ లో వారికి సంబంధించిన మెడికల్ ప్రిస్క్రిప్షన్లు దొరికాయి. ఇక అంతే కాకుండా రెండు లైన్ల లేఖ సంఘటనా స్థలంలో దొరికింది . దీంతో పోలీసులు కరోనా వచ్చింది అన్న అనుమానంతో సూసైడ్ చేసుకున్నారా లేకా ఎవరైనా చంపి ఇలా క్రియేట్ చేశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

కరోనాతో చనిపోయారని స్థానికుల ఆందోళన
ఇక ఈ రోజు జరిగిన ఈ ఘటనతో రాజమండ్రి వాసులు ఉలిక్కిపడ్డారు. కరోనా సోకటం తో చనిపోయారని ప్రచారం జరుగుతున్న వేళ ప్రజలు భయ భ్రాంతులకు గురవుతున్నారు. ఇక పోలీసులు మృత దేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం పంపారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు . ఏది ఏమైనా కరోనా భయంతో ఆత్మహత్యలు, అనుమానాస్పద మరణాలు పెరుగుతున్న తీరు ఆందోళనకరంగా మారింది.
-
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
PM Modi: సీఎంలకు మోడీ సందేశం ఇదే..! మళ్లీ ఆ కోవిడ్ మోడల్..! -
సంక్షోభం వస్తే మీ సన్నద్ధత ఎంత ? సీఎంల భేటీలో ప్రధాని మోడీ..! -
రేవంత్ కు కేంద్రం బంపర్ బొనాంజా , 2028 తర్వాతా - మారుతున్న లెక్కలు..!! -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు












Click it and Unblock the Notifications