మాణిక్యాలరావు కుటుంబానికి మోదీ లేఖ - కరోనాతో మృతి పట్ల ప్రధాని సంతాపం
''మాణిక్యాలరావు చాలా ధైర్యవంతుడైన, చురుకైన నేత. నిరాడంబరంగా జీవిస్తూనే నిత్యం సామాన్యులకు అందుబాటులో ఉండేవారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడానికి ఆయన అంకితభావంతో పని చేశారు. ఆయన మరణం అందరికీ తీరని లోటు. ఈ కష్ట సమయంలో మీకు భగవంతుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను..'' అంటూ ప్రధాని నరేంద్ర మోదీ.. దివంగత ఏపీ బీజేపీ నేత పైడికొండల మాణిక్యాలరావు కుటుంబానికి లేఖ రాశారు.
ఏపీ బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మాణిక్యాల రావు కరోనాతో పోరాడుతూ గత శనివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ.. మాణిక్యాల రావు లేరన్న వార్త విని విషాదానికి లోనయ్యానని లేఖలో పేర్కొన్నారు. ఎదుటివాళ్లకు అభయమిస్తున్నట్లుండే ఆయన రూపాన్ని ప్రజలు చిరకాలం గుర్తుంచుకుంటారని మోదీ వ్యాఖ్యానించారు.

''స్వర్గీయ పైడికొండల మాణిక్యాల రావుకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. కొండలరావు సతీమణి సూర్యకుమారికి ఈ మేరకు ప్రధాని తన సంతాపాన్ని లేఖ ద్వారా పంపారు. ప్రజాహితం కోసం నిబద్ధతతో నిరంతరం పనిచేసిన వ్యక్తిగా మాణిక్యాలరావును మోదీ స్మరించుకున్నారు''అని ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ ట్వీట్ చేసింది.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన మాణిక్యాలరావు సాధారణ ఫొటోగ్రాఫర్ స్థాయి నుంచి స్వయంకృషితో మంత్రి స్థాయికి ఎదిగారు. చిన్నప్పటి నుంచీ సంఘ్ తో అనుంబంధం కలిగిన ఆయన.. బీజేపీ ఆవిర్భావం నుంచీ పార్టీలో కొనసాగారు. 2014లో తాడేపల్లిగూడెం నుంచే గెలిచి, టీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో దేవదాయ, ధర్మాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. కొంతకాలం కిందట కరోనా బారినపడిన ఆయనను కాపాడుకునేందుకు పార్టీ నేతలు తీవ్రంగా శ్రమించారు. విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయనకు.. ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ల బృందం కూడా ట్రీట్మెంట్ ఇచ్చింది. అయితే, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, మధుమేహం తీవ్రతరం కావడంతో చివరికాయన శనివారం తుదిశ్వాస విడిచారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు మాణిక్యాలరావుకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
-
సంక్షోభం వస్తే మీ సన్నద్ధత ఎంత ? సీఎంల భేటీలో ప్రధాని మోడీ..! -
Noida jinx: అక్కడికి వెళ్తే పదవి పోయినట్లేనా ? సెంటిమెంట్ పై మోడీ కామెంట్స్..! -
రేవంత్ కు కేంద్రం బంపర్ బొనాంజా , 2028 తర్వాతా - మారుతున్న లెక్కలు..!! -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!!












Click it and Unblock the Notifications