ఏపీ ఎన్నికలపై ప్రముఖ సెఫాలజిస్ట్ జోస్యం..! హోరాహోరీ పోరులో గెలుపెవరిదంటే ?
ఏపీలో తాజాగా జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా సాగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల నోటిఫికేషన్ కూ పోలింగ్ కు దాదాపు 50 రోజుల పైగా గ్యాప్ రావడం, రాజకీయ పార్టీలు గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, ఈసీ కూడా ఓట్ల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించడం వంటి కారణాలతో పోలింగ్ శాతం భారీగా పెరిగిపోయింది. దేశంలోనే రికార్డు స్దాయిలో 82 శాతం పోలింగ్ నమోదైన ఏపీ ఎన్నికల ఫలితంపైనే ఇప్పుడు అందరి దృష్టీ నెలకొంది.
ఇలాంటి తరుణంలో ఇప్పటికే ప్రధాన పార్టీల నేతలు తమదైన జోస్యాలు చెప్పేస్తున్నారు. వచ్చే నెల 8న ప్రమాణ స్వీకారం చేసేది మా నాయకుడని ఒకరు చెప్తుంటే, కాదు 9న మా నాయకుడే ప్రమాణం స్వీకారం చేయబోతున్నారని మరో పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో ప్రముఖ అధ్యయన సంస్థ సీఎస్డీఎస్ లో సీనియర్ సెఫాలజిస్ట్ గా ఉన్న ప్రొఫెసర్ సంజయ్ కుమార్ ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారో చెప్పేశారు. ఓ చర్చా గోష్టిలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు.

రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ పోరు సాగిందని ప్రొఫెసర్ సంజయ్ కుమార్ తెలిపారు. అయితే ఈ పోరులో టీడీపీదే పైచేయి అయిందని ఆయన విశ్లేషించారు. పసుపు పార్టీవైపే ఓటర్ల మొగ్గు కనిపిస్తోందని ఆయన తెలిపారు. అయితే వైసీపీ, టీడీపీ గెలిచే సీట్లపై మాత్రం ఆయన ఏమీ చెప్పలేదు. ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉండటంతో నంబర్లు చెప్పకపోయినా టీడీపీ గెలవబోతోందనే సంకేతం ఇచ్చారు.
అలాగే రాష్ట్రంలో బీజేపీకి చెప్పుకోదగిన ఓటు బ్యాంకు లేకపోయినా టీడీపీతో జట్టు కట్టడం వల్ల కొన్ని ఎంపీ సీట్లు గెల్చుకోబోతోందని సంజయ్ కుమార్ వెల్లడించారు. మిగతా రాష్ట్రాల్లోనూ బీజేపీ బలంగానే ఉందని, ఈసారి జాతీయ స్ధాయిలో ఎన్నికల్ని ప్రభావితం చేసే అంశాలు లేకపోయినా బీజేపీ కేంద్రంలో మరోసారి అధికారంలోకి వచ్చే పరిస్ధితి ఉందని ఆయన చెప్తున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications