Cyclone Montha: ఏపీ సర్కార్ భారీ సన్నద్ధత..! నిత్యావసరాలపై కీలక చర్యలు..!

ఏపీలో మోంతా తుపాను కలకలం రేపుతోంది. రేపు సాయంత్రానికి ఈ తుపాను ప్రభావం మొదలు కానుంది. ఈ నెల 28న ఇది కాకినాడ వద్ద తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం భారీ అప్రమత్తత ప్రకటించింది. దీంతో పాటు తుపానును దృష్టిలో ఉంచుకుని పలు ముందుజాగ్రత్తలు తీసుకుంటోంది. ముఖ్యంగా ప్రజలకు నిత్యావసరాల లభ్యతలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటోంది.

ఇందులో భాగంగా తీరప్రాంత జిల్లాల్లోని అన్ని మండల స్థాయి స్టాక్ పాయింట్లలో రేషన్ సరుకులు తగినంతగా అందుబాటులో ఉంచుతున్నారు. తీరప్రాంతాల్లోని అన్ని రేషన్ దుకాణాలకు ఆహార ధాన్యాల్ని తరలిస్తున్నారు. సంబంధిత జాయింట్ కలెక్టర్ల నుండి వచ్చిన అభ్యర్థనల ప్రకారం మండల స్థాయి స్టాక్ పాయింట్ల నుండి FP దుకాణాలకు ఆహార ధాన్యాల దశ 2 తరలింపు కు జీపీఎస్ ట్రాకింగ్ నుండి మినహాయింపు కూడా ఇచ్చారు. అలాగే పెట్రోల్, డీజిల్ రవాణాలో ఎలాంటి అంతరాయాలు లేకుండా ముందుగానే స్టాక్ చేసుకుంటున్నారు.

Cyclone Montha AP Government Ensures Essential Goods Availability Precautionary Measures in Place

అలాగే టెలికాం టవర్లు, ఆసుపత్రులు, కంట్రోల్ రూములు, తుపాను రక్షణ కేంద్రాల వంటి కీలకమైన ప్రాంతాల్లో విద్యుత్ బ్యాకప్ కోసం అవసరానికి అనుగుణంగా డీజిల్ , పెట్రోల్ నిల్వ కోసం జిల్లా కలెక్టర్లు చమురు మార్కెటింగ్ కంపెనీల ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటున్నారు. ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్లు జిల్లా వ్యవసాయ అధికారులతో కలిసి ఇప్పటికే కోసిన వరిని గుర్తించి సమీపంలోని బియ్యం మిల్లులకు వెంటనే తరలించాలని ఆదేశాలిచ్చారు. రైతులకు పంపిణీ చేయడానికి , వర్షం నష్టం నుండి వరిని రక్షించడానికి తాత్కాలిక షెడ్లలో వాడేందుకు టార్పాలిన్లను వరి సేకరణ కేంద్రాలలో అందుబాటులో ఉంచుతున్నారు.

Cyclone Montha AP Government Ensures Essential Goods Availability Precautionary Measures in Place

రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో దాదాపు 1500 బియ్యం మిల్లులు వరి సేకరణ కోసం రైతు సేవా కేంద్రాలకు ట్యాగ్ చేశారు. తడిసిన వరిని ఆరబెట్టడానికి స్థలం కల్పించాలన, వాటిని కవర్ చేయడానికి ఏర్పాట్లు చేయాలని మిల్లర్లను కోరారు. ప్రతికూల కాలానుగుణ పరిస్థితుల కారణంగా వరి సేకరణ తొందరలో అధిక తేమ కారణంగా రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని మిల్లర్లను అప్రమత్తం చేయాలని జాయింట్ కలెక్టర్లను ఆదేశించారు. తుపాను షెల్టర్లు , విపత్తు సహాయ శిబిరాలలో ఆహార సరఫరాను కలెక్టర్లు పర్యవేక్షించాలి. విపత్తు సహాయ పంపిణీ కింద సహాయ స్థాయి ప్రకారం నిత్యావసర వస్తువుల పంపిణీ , ఖర్చు తిరిగి చెల్లింపు కోసం జిల్లా కలెక్టర్లు విపత్తు నిర్వహణ విభాగానికి ప్రతిపాదనలను సమర్పించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+