ఎలా పంపిస్తారు?: కిరణ్పై డిఎస్, డికె అరుణ నిప్పులు
అదిలాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నాయకులు బుధవారం మండిపడ్డారు. అదిలాబాద్ నిర్మల్లో ఏర్పాటు చేసిన కాంగ్రెసు పార్టీ కృతజ్ఞత సభలో శాసన మండలి సభ్యుడు డి శ్రీనివాస్, మంత్రి డికె అరుణ తదితరులు మాట్లాడారు. ముఖ్యమంత్రి ఎవరినీ సంప్రదించకుండా కేంద్రానికి ప్రభుత్వం తరఫున నివేదిక పంపించడం సరికాదన్నారు. ఆయన నివేదికను ఎవరూ పట్టించుకోరన్నారు.
కిరణ్ అయినా మరెవరైనా సిడబ్ల్యూసి నిర్ణయాన్ని గౌరవించాల్సిందేనని చెప్పారు. సామాజిక తెలంగాణ వస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బలహీనవర్గాలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. తెలంగాణ వచ్చాక పదేళ్లలో రాష్ట్రాన్ని దేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా చేద్దామన్నారు. తెలంగాణను అభివృద్ధి చేసే నాయకత్వం మనకు ఉందన్నారు. పార్టీలను నివేదిక ఇవ్వాలని జివోఎం కోరిందని చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర ప్రకటన 30 జూలైన చేసింది కాదని, డిసెంబర్ 9, 2009న తీసుకున్న నిర్ణయమేనని అన్నారు. నాడు పలువురు విభజనకు అడ్డుపడ్డారని విమర్శించారు. తెలంగాణపై మూడు నెలల క్రితమే కొత్తగా ప్రకటన చేయలేదన్నారు. నాడు పార్లమెంటులోనే ప్రకటించారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఎవరి ప్రమేయం లేదని, సోనియా గాంధీ మాత్రమే ఇచ్చారని డిఎస్ తెరాసను ఉద్దేశించి చెప్పారు.
ఫోటో పెట్టనివ్వం: పొన్నం
తెలంగాణలో రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఫ్లెక్సీని పెట్టనివ్వమని కరీంనగర్ ఎంపి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ మంత్రుల అభిప్రాయాలు తీసుకోకుండా ఆయన తప్పుడు నివేదికలు పంపించారని ఆరోపించారు.
సిఎం ఎలా పంపిస్తారు: డికె అరుణ
తెలంగాణ మంత్రుల అనుమతి లేకుండా ముఖ్యమంత్రి కేంద్రానికి నివేదిక ఎలా పంపుతారని మంత్రి డికె అరుణ ప్రశ్నించారు. వచ్చేది సామాజిక తెలంగాణ అని, బహుజనులకు న్యాయం జరుగుతుందన్నారు. పొత్తుల పైన తెరాస అధ్యక్షుడు కెసిఆర్ తన వైఖరి స్పష్టం చేయాలన్నారు.
ఆదుకుంటాం: షబ్బీర్
తెలంగాణ రాష్ట్రం వచ్చాక అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని ఎమ్మెస్ షబ్బీర్ అలీ అన్నారు.
టిడిపి ఎందుకు వెళ్లలేదు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
అఖిల పక్షాన్ని డిమాండ్ చేసిన తెలుగుదేశం పార్టీ జివోఎం భేటీకి ఎందుకు వెళ్లలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. టిడిపి తెలంగాణకు అనుకూలమైతే జివోఎంకు వెళ్లాల్సి ఉండెనన్నారు. ఆ పార్టీకి వచ్చే ఎన్నికలలో డిపాజిట్లు కూడా రావన్నారు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications