చెప్పింది గుర్తు పెట్టుకుని పని చెయ్యండి, డీసీఎం పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుర్ల ప్రాంతంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. బాధితులను ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను రిపీట్ కాకుండా చూసుకుంటామని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు, స్థానిక ప్రజలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.
విజయనగరం జిల్లాలోని గుర్ల ప్రాంతంలో సోమవారం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక పీహెమ్ సీలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరామర్శించారు. డయేరియా వ్యాధి వ్యాప్తి, ఆ వ్యాధికి సంబంధించిన కారణాలపై వైద్య శాఖ అధికారులు నుండి పవన్ కల్యాణ్ వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ సంబందిత అధికారులకు పలు సూచనలు చేశారు.

డయేరియా బాధితులకు ఎలాంటి వైద్య చికిత్స అందించాలన్నా మరో ఆలోచన లేకుండా వారికి మెరుగైన చికిత్స అందించాలని, ఆ విషయంలో ఎవ్వరూ నిర్లక్షంగా వ్యవహరించకూడదని విజయనగరం జిల్లా వైద్యశాఖ అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు నెల్లిమర్ల మండలంలో ఎస్ఎస్ఆర్ పేట వద్ద తాగునీటి పథకాన్ని డీసీఎం పవన్ కల్యాణ్ పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో తాగునీటి వ్యవస్థ ఎలా ఉంది అంటూ పవన్ కల్యాణ్ సంబంధిత అధికారుల నుంచి వివరాలు సేకరించారు. విజయనగరం జిల్లాలో గుర్ల ప్రాంతంలో డయేరియా వ్యాధి వ్యాపించడంతో సంబంధిత అధికారులతో పవన్ కల్యాణ్ ప్రత్యేక సమావేశం కానున్నారు. సోమవారం సాయంత్రం విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కొన్ని శాఖల అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు.
గుర్ల గ్రామంలో అతిసార బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్న గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు. pic.twitter.com/CydpJXZIYQ
— JanaSena Party (@JanaSenaParty) October 21, 2024
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ వైద్య శాఖ అధికారులకు పలు సూచనలు చేసే అవకాశం ఉందని తెలిసింది. విజయనగరం జిల్లాలో డయేరియా వ్యాధి వ్యాపించడంతో ఇప్పటికే ఏడు మంది చనిపోయారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పిన విషయం తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వంలో తాగునీటి వ్యవస్థ, డ్రైనేజీల నిర్వహణను పూర్తిగా నిర్లక్ష్యం చెయ్యడం వలనే గుర్ల ప్రాంతంలో డయేరియా వ్యాధి తాండవం చేసిందని, ఈ పాపం వైసీపీ నాయకులదే అని రెండు రోజుల క్రితం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
-
'అమరావతి' పై మారిన జగన్ నిర్ణయం, ఢిల్లీ మంత్రాంగం - పార్లమెంట్ సాక్షిగా..!! -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్












Click it and Unblock the Notifications