లక్ష్మీపార్వతి, హరికృష్ణలకు షాక్: తెలుగు రాష్ట్రాల్లో 12 పార్టీలు రద్దు!
అన్నా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు హరికృష్ణ, ఎన్టీఆర్ టీడీపీ వ్యవస్థాపకురాలు లక్ష్మీపార్వతికి షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా 255 రాజకీయ పార్టీలను రద్దు చేస్తూ ఎన్నికల కమిషన్ ఓ ప్రకటన విడుదల చేసింది.
విజయవాడ/న్యూఢిల్లీ: అన్నా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు హరికృష్ణ, ఎన్టీఆర్ టీడీపీ వ్యవస్థాపకురాలు లక్ష్మీపార్వతికి షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా 255 రాజకీయ పార్టీలను రద్దు చేస్తూ ఎన్నికల కమిషన్ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇందులో హరికృష్ణ స్థాపించిన అన్నా టిడిపి, లక్ష్మీపార్వతి స్థాపించిన ఎన్టీఆర్ టిడిపిలు ఉన్నాయి. ఆ పార్టీలు పేరుకే ఉన్నాయి. కానీ లక్ష్మీపార్వతి వైసిపిలో చేరారు. హరికృష్ణ టిడిపిలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో 12 పార్టీలను రద్దు చేశారు.

ఆలd ఇండియా సద్గుణ పార్టీ, ఆంధ్ర నాడు పార్టీ, అన్నా తెలుగు దేశం పార్టీ, బహుజన రిపబ్లికన్ పార్టీ, భారతీయ సేవాదళ్, జై తెలంగాణ పార్టీ, ముదిరాజ్ రాష్ట్రీయ సమితి, నేషనల్ సిటిజన్స్ పార్టీ, ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ, సత్యయుగ్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రజా పార్టీలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications