అనంతపురం కోర్టుది తప్పుడు వారెంట్: ధోనీని అరెస్ట్ చేయాలనడంపై లాయర్
అనంతపురం: ఏపీలోని అనంతపురం జిల్లా కోర్టు తీర్పు పైన భారత వన్డే, టీ 20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తరఫు న్యాయవాది శుక్రవారం స్పందించారు. ధోనీ పైన కోర్టు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ తప్పుడుదని అతని న్యాయవాది రజనీశ్ చోప్రా చెప్పారు.
2013లో బిజినెస్ టుడే లో ధోనీని విష్ణుమూర్తి అవతారంలో వేసిన పత్రిక ఫోటోలో ధోనీ చేతిలో ఓ పాదరక్షను ఉంచింది. దీనిపై అప్పటి విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్యామ్ సుందర్ ధోనీపై అనంతపురం జిల్లా కోర్టులో కేసు వేశారు.

దీనిపై విచారణ జరుగుతోంది. విచారణకు ధోనీ హాజరుకాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అనంతపురం కోర్టు వచ్చే నెల 25న ధోనీ వ్యక్తిగతంగా హాజరు కావాలని, లేకుంటే అతనిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది.
దీనిపై ధోనీ లాయర్ రజనీశ్ చోప్రా మాట్లాడారు. తమకు న్యాయస్ధానం నుంచి ఎలాంటి సమన్లు అందలేదన్నారు. అలాంటప్పుడు నాన్ బెయిలబుల్ వారంట్ ఎలా జారీ చేస్తారని ప్రశ్నించారు. ధోనీ న్యాయవ్యవస్థను గౌరవిస్తారని చెప్పారు. అయితే, వ్యక్తిగతంగా ధోనీ ఎప్పుడు సమన్లు అందుకోలేదన్నారు. కాబట్టి ఈ తీర్పు సరికాదన్నారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications