విద్యుత్ బిల్లు మోగనుంది!: రూ.3.72 వరకు పెంపు

తమకున్న నష్టాలన్నీ పూడ్చుకొని ప్రతీ యూనిట్పై కనీసం ఐదు పైసల లాభం వచ్చేలా ఛార్జీలను పెంచాలని డిస్కంలు కోరాయి. త్వరగా ప్రతిపాదనలు పంపాలని సర్కారు కూడా తొందరపెట్టడంతో కన్సల్టెంట్ల సహకారంతో లెక్కలు కట్టి గతేడాది కంటే రెట్టింపు విద్యుత్ చార్జీలను ప్రతిపాదిస్తూ బంతిని ఈఆర్సీ కోర్టులోకి బుధవారం నాడు నెట్టేశాయి.
డీజిల్, పెట్రోలు, వంటగ్యాస్, నిత్యావసర సరకుల ధరల పెరుగుదలతో ఇప్పటికే సతమతమవుతున్న సామాన్యుడిని విద్యుత్ చార్జీల పెంపు కోలుకోలేని దెబ్బతీయడం ఖాయంగా కనిపిస్తోంది. సగటు జీవికి విసనకర్రలు, కిరోసిన్ బుడ్డిలే దిక్కయ్యేలా డిస్కంలు వ్యవహరిస్తున్నాయి.
రాష్ట్రంలో మొత్తం 2.54 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులుంటే ఉచిత విద్యుత్ పరిధిలోకి వచ్చే 30 లక్షల మంది రైతులను మాత్రం వదిలిపెట్టి మిగిలిన అన్ని వర్గాలకూ దిమ్మదిరిగేలా చార్జీలను పెంచడానికి డిస్కంలు ప్రతిపాదించాయి. కనిష్ఠంగా 50 పైసలు, గరిష్ఠంగా 3.72 రూపాయల వరకు పెంచాలని ఈఆర్సిని కోరాయి.
-
హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం.. -
మూడు రోజులు వర్షాలు.. వరుణ సందేశం ఇచ్చిన వాతావరణ శాఖ! -
Lockdown: ఇవాళ రాత్రి నుంచే కర్ఫ్యూ, ప్రభుత్వం సంచలన నిర్ణయం! -
ప్రపంచంలోనే అత్యధిక సైన్యం కలిగిన దేశాలు ఇవే.. మారిన లెక్కలు.. -
ఒక్క పోస్టుతో అందరికీ ఇచ్చిపడేసిన "త్రిష".. -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!!












Click it and Unblock the Notifications