మద్యం తాగొద్దన్న కూతురు: నిప్పు పెట్టిన తల్లి

పోలీసుల కథనం ప్రకారం.. చంద్రసేన అనే వివాహిత తన కూతురు శిరీష (8) శనివారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఆమెపై కిరోసిన్ పోసి నిప్పింటించింది. మద్యం తాగవద్దని ఆమెపై ఒత్తిడి తీసుకురావడం వల్లే తన కూతురు హత్యకు చంద్రసేన పూనుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
కిరోసిన్ పోసి నిప్పింటించడంతో బాధిత బాలిక సహాయం చేయాలని అరుపులు, కేకలు పెట్టింది. దీంతో స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పివేశారు. వెంటనే బాధితురాలిని చేజెర్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. 80శాతం కాలిన గాయాలపాలైన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణిచింది.
ఘటన జరిగిన సమయంలో బాధితురాలి తల్లి చంద్రసేన మద్యం మత్తులో మద్యం మత్తులో ఊగిపోతోందని స్థానికులు తెలిపారు. కాగా తనకేం తెలియదని చెప్పిన చంద్రసేన, ఆ తర్వాత గ్రామం నుంచి పరారైంది. ఘటనపై చేజెర్ల పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం కేసును మార్చనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications