వైఎస్ఆర్ ను తిట్టమన్నారు. జగన్ కు చెప్పే చేస్తా. పార్టీ మార్పుపై దువ్వాడ స్టేట్మెంట్
దువ్వాడ జంట అంటే తెలుగు రాష్ట్రాల్లో పాలిటిక్స్ ఫాలో అవుతున్న ఎవరికైనా తెలిసే ఉంటుంది. ఇక బిగ్బాస్ సీజన్ 9 ఫాలో అయిన వారికి మాధురి అంటే ఇంకా బాగా తెలుసు. ఈ జంట తమ కొత్త జీవితాన్ని గడుపుతూ 2.0 ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బిగ్బాస్ సీజన్ 9 లో దివ్వెల మాధురి కొంచం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దువ్వాడ శ్రీనివాస్ కూడా ఈ మధ్య బాగా మీడియా ముందుకు వస్తూ.. తమ లైఫ్ గురించి పొలిటికల్ జర్నీ గురించి చాలా విషయాలే పంచుకుంటున్నారు.
ఏదో ఒక రకంగా ఈ జంట సోషల్ మీడియాలో నిలుస్తున్నారు. కాగా ఇటీవల ఓ ఫేమస్ జర్నలిస్ట్ కు ఇచ్చిన ఇంటర్వూలో దువ్వాడ చాలా విషయాలను బయటపెట్టేశారు. ఇవి రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. వైఎస్ఆర్ ను తిట్టమని ఒత్తిడి చేసింది ఎవరు? ఏ రాజకీయ పార్టీలో చేరబోతున్నారు? జగన్ తో ఇంకా దువ్వాడ టచ్ లోనే ఉన్నారా అనే విషయాలు ఇక్కడ చుద్దాం
బీజేపీలో చేరతారా..?
దువ్వాడ శ్రీనివాస్ ను వైసీపీ నుంచి బహిష్కరించినా ఆయనకు జగన్ మీద ఇంకా అభిమానం ఉందా అంటే అవుననే సమాధానాన్ని ఓ ఇంటర్వూలో బయటపెట్టేశారు. జనసేన- టీడీపీ కూటమిలో చేరతారా అనే ప్రశ్నకు మాత్రం చాలా స్పష్టంగా అలాంటి పని చేయను, ఆ పార్టీలో చేరను అని గట్టిగా బదులిచ్చారు. మరి బీజేపీలో చేరతారా? అంటే అదే ప్రజలే నిర్ణయిస్తారు అని దువ్వాడ చెప్పగా.. వెంటనే దివ్వెల మాధురి "ఏమో వెళ్తామెమో "అని అన్నారు. దీంతో రిపోర్టర్ షాక్ అయ్యారు.

జగన్ కు వెన్నుపోటు పొడుస్తారా..?
ఇది మీ దేవుడికి వెన్ను పోటు పొడిచినట్లేగా అని సదరు జర్నలిస్ట్ అడిగిన నేపథ్యంలో దువ్వాడ.. దాన్ని ఖండించారు. "కాదు. అన్నా నువ్వంటే చాలా అభిమానం. నిన్ను నా నుంచి దూరం చేశారన్నా. చాలా భాధలో ఉన్నా. నేను ఇండిపెండెంట్ గా ఉన్నాను. నేను ఎప్పుడైనా పొజిషన్లోకి వస్తే నీ దగ్గరకే వస్తా అన్నా.. నీ ఆశీస్సులే నాకుండాలన్నా" అని చాలా స్పష్టంగా బదులిచ్చారు. దీంతో వైసీపీ దువ్వాడను బహిష్కరించినా.. ఆయనకు మాత్రం జగన్ పై నిలువెత్తు విశ్వాసం, అభిమానం ఉందని మరో మారు తేల్చిచెప్పారు.
వైఎస్ఆర్ ను తిట్టమన్నారు..
వేరే పార్టీ లైన్ లో మీ దేవుడ్ని తిట్టాల్సి వస్తే అని అడగ్గా.. నేను ఎప్పుడూ విమర్శించను అన్నారు. రాజశేఖర రెడ్డిని విమర్శించమని ప్రజారాజ్యంలో తనకు చాలా ప్రెషర్ వచ్చిందని కానీ తాను విమర్శించలేని తెలిపారు. జగన్ ను తిట్టాలని పార్టీ లైన్ ఉన్నప్పుడు.. బీజేపీలోకి వస్తే అనగా.. " నా లైన్ నాకుంది. నా అనుభవం చెప్తున్నా. జరబోయేది ఎందుకు చెప్పాలి. జరిగింది చెబుతా. పీఆర్పీలో ఉన్నప్పుడు నువ్వు మీ గురువును తిట్టు, విమర్శించు అన్నారు. నేను తిట్టలేదు. బై ఎలక్షన్ లో చిరంజీవి వచ్చి నాతో నామినేషన్ వెయించారు. 18 మంది ఎమ్మెల్యేలు ప్రచారానికి వచ్చారు. అప్పటికే వైఎస్ఆర్ చనిపోయి 4 రోజులు. మా ఇంట్లో వైఎస్ఆర్ ఫోటోలుండేవి. పెద్ద పెద్ద వారే వచ్చారు. వాళ్ల పేర్లు ఎందుకులే. ఇదేందయ్యా నువ్వు పీఆర్పీ నుంచి పోటీ చేస్తూ.. వైఎస్ఆర్ ఫోటో పెట్టుకున్నావ్. తీయ్ అబ్బా అన్నారు. నేను తీయలేదు అని జరిగిన విషయాన్ని బయటపెట్టేశారు.
ఆ పెద్ద మనుషులు వీరే..
ఆ పెద్ద మనుషులు ఎవరని రిపోర్టర్ ప్రశ్నించగా.. ఎందుకులే అండి వారిలో ఒకరు చనిపోయారు. కోటగిరి విద్యాధర్ రావు, శ్రీరామ్ చంద్రయ్య అని పేర్లు బయటపెట్టేశారు. ఇలా దువ్వాడ వైఎస్ఆర్ ను, జగన్ మోహన్ రెడ్డిని విమర్శించలేమని, తాము ఏ రాజకీయ పార్టీలో చేరినా.. తమ సొంత లైన్ ప్రకారం వీరిద్దరిని గౌరవిస్తామన్నారు. అదే విధంగా జగన్ కు తనకు దూరం చేసిన వారిని కూడా గుర్తుపెట్టుకుంటానని ఉత్తరాంధ్రాకు చెందిన వైసీపీ సోదురులపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ?












Click it and Unblock the Notifications