మా జోలికొస్తే.. కూటమికి ఉద్యోగ నేత రెడ్ బుక్ వార్నింగ్..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగులపై వేధింపులు ఎదురవుతున్నాయని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. ముఖ్యంగా పెన్షన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వం ఉద్యోగులను టార్గెట్ చేస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. ఇదే పరిస్ధితి కొనసాగితే ఉద్యోగులు ఏం చేయాలో కూడా ఆయన చెప్పేశారు. దీంతో వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. తాడేపల్లిలో జరిగిన ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ భేటీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
గత వైసీపీ ప్రభుత్వంలో వెంకట్రామిరెడ్డి సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉండే వారు. గత ఎన్నికల్లో వైసీపీకి ఓటేయాలని ఆయన ఊరూరా తిరిగి ప్రచారం చేయడంతో ఈసీ ఆదేశాలతో ఆయనపై వేటు పడింది. అప్పట్లో ఆయన్ను సస్పెండ్ చేశారు. ఇప్పటికీ అది కొనసాగుతోంది. అలాగే సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడిగా కూడా ఆయన్ను తొలగించి కొత్తగా ఎన్నికలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న వెంకట్రామిరెడ్డి ఉద్యోగుల వేధింపులపై గళం విప్పారు.

ఉద్యోగులను ఎవరైనా ఇబ్బంది పెడితే వారి పేర్లు రాసి పెట్టుకోవాలని వారికి సూచించారు. అలాంటి వారు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకుంటారని వెంకట్రామిరెడ్డి రెడ్ బుక్ తరహాలోనే హెచ్చరికలు చేశారు. సమీక్షా సమావేశాల్లో కింది స్దాయి అధికారుల్ని పైస్థాయి అధికారులు వేధిస్తున్నారని, టీడీపీ కార్యకర్తలొస్తే గౌరవంగా టీ ఇచ్చి మాట్లాడి పంపాలని, లేకపోతే మీ సంగతి చూస్తామని మంత్రులు హెచ్చరికలు చేస్తున్నారని వెంకట్రామిరెడ్డి ఆరోపించారు.
అలాగే సచివాలయ ఉద్యోగులు తెల్లవారు జామునే వెళ్లి తలుపులు కొట్టి పెన్షన్లు ఇమ్మంటున్నారని, ఉదయం 8 గంటల కల్లా ఇస్తే ప్రపంచం ఏమైనా తలకిందులవుతుందా అని వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉద్యోగులకు ఐఆర్ ఇస్తామని చెప్పి మాట తప్పారన్నారు. ఇప్పటికైనా ఐఆర్ ఇవ్వాలని, పెండింగ్ డీఏల్లో ఒక్కటైనా ఇవ్వాలని వెంకట్రామిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
-
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
ఏపీ విద్యార్ధులకు సర్కార్ గుడ్ న్యూస్..! దేశంలో తొలిసారి..! -
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
ఏపీ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో అడ్మిషన్లపై కీలక అప్డేట్..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!












Click it and Unblock the Notifications