చంద్రబాబుకి షాక్: టిడిపికి గుడ్బై, కాంగ్రెస్లోకి ఎర్రబెల్లి?

ఈ రోజు మధ్యాహ్నం రెండుగంటలకు ఆయన తన వర్గం వారితో భేటీ కానున్నారు. ఈ భేటీలో కార్యకర్తలు, తన అనుచరుల అభిప్రాయాలను ఆయన తీసుకోనున్నారు. ఆ తర్వాత ప్రకటన చేయనున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ను ఎర్రబెల్లి కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కాగా, ఇప్పటికే పలువురు తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్న విషయం తెలిసిందే. బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే గంపా గోవర్ధన్, వికారాబాద్ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్ రెడ్డి, నిర్మల్ ఎమ్మెల్యే వేణుగోపాలా చారి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ టిడిపికి రాజీనామా చేసి తెరాసలో చేరారు.
ఇటీవల నిజామాబాద్ జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే హన్మంతు షిండే, రంగారెడ్డి జిల్లా తాండూర్ ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి, చేవేళ్ల ఎమ్మెల్యే రత్నం, అదే జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి తెరాసలో చేరారు. వరంగల్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్, బోథ్ ఎమ్మెల్యే నగేష్లు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నారు.












Click it and Unblock the Notifications