Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టాప్ గేర్‌లో వైఎస్ జగన్: గుంటూరు జిల్లాలో పింఛన్ల పెంపు-బహిరంగ సభ అందులో భాగమే

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూటు మార్చారు. జనం బాట పట్టారు. క్షేత్రస్థాయి పర్యటనకు శ్రీకారం చుట్టారు. ప్రత్యక్షంగా ప్రజలను కలుసుకోనున్నారు. వారితో మమేకం కానున్నారు. సంక్షేమ పథకాలను ఆయన జనం మధ్యే ప్రారంభించనున్నారు. వాటి అమలు తీరును స్వయంగా పర్యవేక్షించనున్నారు. డెలివరీ సిస్టమ్‌లో చోటు చేసుకున్నట్టుగా భావిస్తోన్న లోపాలను సవరించే ప్రయత్నం చేయనున్నారు. మరింత మెరుగైన పరిపాలనను అందించడానికి అవసరమైన సలహాలు, సూచనలను ప్రజల నుంచి స్వీకరించే దిశగా చర్యలు తీసుకోనున్నారు.

ప్రత్తిపాడులో బహిరంగ సభ ఉద్దేశం అదే..

ప్రత్తిపాడులో బహిరంగ సభ ఉద్దేశం అదే..

ఇవ్వాళ వైఎస్ జగన్ గుంటూరు జిల్లాలో పర్యటించారు. ప్రత్తిపాడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. పింఛన్ల పెంపు పథకాన్ని ఆయన ప్రారంభించారు. సామాజిక భద్రతను కల్పించడంలో భాగంగా పేద కుటుంబాల వారికి అందజేస్తోన్న 2,250 చొప్పున ఇస్తోన్న పింఛన్‌ మొత్తాన్ని 2,500కు పెంచింది ప్రభుత్వం. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈ పింఛన్ల పెంపు కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో లాంఛనంగా ప్రారంభించారు.

 క్యాంప్ కార్యాలయాన్ని వీడి..

క్యాంప్ కార్యాలయాన్ని వీడి..

సాధారణంగా- ఇలాంటి నిధుల విడుదల కార్యక్రమాలను వైఎస్ జగన్.. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి చేపడుతుంటారు. జగనన్న ఆసరా, వైఎస్ఆర్ రైతు భరోసా, జగనన్న చేయూత, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, అమ్మఒడి.. వంటి పథకాలన్నింటికీ ఇప్పటిదాకా ఆయన క్యాంప్ కార్యాలయం నుంచే నిధులను విడుదల చేస్తూ వచ్చారు. అర్హత ఉండీ సంక్షేమ పథకాల లబ్దిని పొందలేకపోయిన 9,30,809 కుటుంబాలకు వివిధ పథకాల కింద 703 కోట్ల రూపాయలను కిందటి నెల 28వ తేదీన క్యాంపు కార్యాలయం నుంచే విడుదల చేశారు.

ఈ దఫా మాత్రం.. జనం మధ్యే

ఈ దఫా మాత్రం.. జనం మధ్యే

కొత్త సంవత్సరం నుంచి ఆయన తన రూటు మార్చారు. పింఛన్ల పెంపు కార్యక్రమాన్ని జనం మధ్యే నిర్వహించారు. దీనికోసం గుంటూరు జిల్లాలో పర్యటించారు. ఇదే తరహాలో.. ప్రతి సంక్షేమ పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేసే కార్యక్రమాన్ని జనం మధ్యే నిర్వహించాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిధులను విడుదల చేసే పరంపరకు బ్రేక్ వేశారు.

 ప్రజల్లోకి..ప్రజల మధ్య..

ప్రజల్లోకి..ప్రజల మధ్య..

ఇప్పటి నుంచి వైఎస్ జగన్ జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారని రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సైతం స్పష్టం చేశారు. ఇక మీదట ప్రభుత్వ సంక్షేమ పథకాలను తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి కాకుండా ప్రజల్లోకి వెళ్లి, వారి మధ్య నుంచే సంక్షేమ పథకాలను ప్రారంభిస్తారని తెలిపారు. ప్రతి పథకం కలిగే లబ్దిని, ప్రయోజనాలను బహిరంగ సభల ద్వారా నేరుగా అందిస్తారని చెప్పారు.

Recommended Video

    Swami Paripoornananda Slams Ys Jagan.. హిందూ పండగలపై ఆంక్షలెందుకు? | Oneindia Telugu
    కేక్ కట్..

    కేక్ కట్..

    నూతన సంవత్సరం వేడుక‌లను పురస్కరించుకుని తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు జగన్‌ను ఆశీర్వదించారు. స్వామివారి శేషవస్త్రాన్ని కప్పి, ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ కేక్ కట్‌ చేశారు. మంత్రులు, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారుల‌ు ఇందులో పాల్గొన్నారు. ముఖ్య‌మంత్రికి మంత్రులు, ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆయనను కలిసిన వారిలో ఉన్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+