అలా చేస్తే సీఎంగా జగన్ 30ఏళ్లు : ఆ వ్యాఖ్యలతో విభేదిస్తున్నా: ఉండవల్లి అరుణకుమార్..!
Recommended Video
ఏపీ ఎన్నికల్లో రాష్ట్ర చరిత్రలో 50శాతం ఓట్లు సాధించిన ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల అభిమానాన్ని సంపాదించారని ప్రశంసించారు.నిజంగా అవినీతి లేకుండా పాలన అందిస్తే 30 ఏళ్లపాటు జగన్ సీఎంగా ఉంటారన్నారు. వైఎస్ జగన్పై ఉన్న లక్షకోట్ల ఆరోపణలను ఒప్పుకోలేదు. ఏడాదిపాటు అసెంబ్లీకి వెళ్లకపోయినా జనం వైఎస్ జగన్ను భారీ మెజారిటీతో గెలిపించారని చెప్పుకొచ్చారు.

ఆ వ్యాఖ్యలతో విభేదిస్తున్నాను..
కేంద్ర ప్రభుత్వానికి మన అవసరం లేదు కాబట్టి, ప్రధానిని కలిసిన ప్రతిసారీ అడిగి ప్రత్యేకహోదా తెచ్చుకోవాలంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. దీని పైన జగన్ చేసిన వ్యాఖ్యలతో తాను విభేదిస్తున్నానని స్పష్టం చేసారు.ప్రత్యేకహోదా విభజన చట్టంలో ఉందని.. ఇచ్చి తీరాల్సిందేనన్నారు.
అవినీతి రహిత పాలన అందిస్తామని జగన్ చెప్పడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. విప్లవాత్మక మార్పులకు జగన్ వ్యాఖ్యలు నాంది అని పేర్కొన్నారు. ఇసుక మాఫియాను మొదట అరికట్టాలని సూచించారు. ప్రభుత్వ సలహాదారుగా అజయ్కల్లాం నియామకం హర్షనీయమని ఉండవల్లి అరుణ్కుమార్ పేర్కొన్నారు. చంద్రబాబుపై నెగిటివ్ ఓటుతో జగన్ అధికారంలోకి రాలేదన్నారు. ప్రజలకు ఏదో చేస్తాడన్న నమ్మకంతో జగన్కు ఓటేశారన్నారు. జగన్ 50శాతం ఓట్లతో గెలవడం గొప్ప విషయమని ఉండవల్లి అరుణ్కుమార్ పేర్కొన్నారు.

లక్ష కోట్ల అరోపణలు ఒప్పుకోలేదు..
ఎన్నికల్లో టీడీపీకి చెందిన హేమాహేమీలు ఓడిపోయారున్నారు. పాజిటివ్ ఓటుతో వచ్చిన ప్రభుత్వాలకు బాధ్యత ఎక్కువగా ఉంటుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం రేట్లు పెంచే విషయంపై పీపీఏను సంప్రదించారా అని అధికారులను అడిగినా... సమాధానం ఇప్పటివరకూ ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. చేసిన పనికన్నా ప్రచారం ఎక్కువ చేసుకోబట్టే చంద్రబాబు ఓడిపోవాల్సి వచ్చిందన్నారు. వైఎస్ జగన్పై ఉన్న లక్షకోట్ల ఆరోపణలను ప్రజలను ఒప్పుకోలేదని.. ఏడాదిపాటు అసెంబ్లీకి వెళ్లకపోయినా జనం వైఎస్ జగన్ను భారీ మెజారిటీతో గెలిపించారని ఉండవల్లి వ్యాఖ్యానించారు. పోలవరం పనులపై జ్యుడిషీయల్ బాడీని ఏర్పాటు చేస్తామని ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళ్లాలని, వైఎస్సార్ గతంలో ఎవరిని సంప్రదించారో వారితోనే సంప్రదించి, వారి సలహాలను స్వీకరించండని వైఎస్ జగన్కు సూచించారు.

ఇలా చేస్తే 30ఏళ్లే అతనే సీఎంగా..
ప్రధాని మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో సామరస్యంగా ఉండడమే మంచిదని ఉండవల్లి అభిప్రాయం వ్యక్తం చేసారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రూ. 23వేలకోట్ల ఆస్తులు ఇప్పటి వరకు రాలేదని గుర్తుచేశారు. వాన్పీక్ వైఎస్సార్ డ్రీమ్ అని.. దాని వల్ల ప్రకాశం, నెల్లూరు జిల్లాలో నిరుద్యోగం సమసిపోతుందని చెప్పారు. సిటీ ప్రాజెక్టును ప్రారంభించిన ఘనత వైఎస్సార్కే దక్కుతుందని పేర్కొన్నారు. కేరళలలో అవినీతికి జరకుండా అక్కడి ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలను వైఎస్ జగన్ ఇక్కడ కూడా అమలుచేస్తే.. మరో 30 ఏళ్లు సీఎంగా ఆయనే కొనసాగుతారని ఉండవల్లి తన అభిప్రాయంగా చెప్పుకొచ్చారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications