వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చింతచెట్టులో మంటలు, ఆర్పేసిన అగ్నిమాపక సిబ్బంది

By Srinivas
|
Google Oneindia TeluguNews

గుంటూరు: ఏపీలోని గుంటూరు జిల్లా నర్సారావుపేట పాత ఆర్డీవో కార్యాలయం వద్ద చింతచెట్టు నుంచి మంటలు వస్తున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టి ఉండవచ్చునని స్థానికులు చెబుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసింది.

Fire from tamarind tree in Guntur district

విద్యుదాఘాతంతో ఇద్దరు రైతులు మృతి

ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బూరులో విషాదం నెలకొంది. పొలంలో విద్యుత్‌ స్తంభాన్ని ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్‌ తీగలు తగిలి ఇద్దరు రైతులు మృతి చెందారు. మృతులు గొబ్బూరుకు చెందిన అనిల్‌, నాగిరెడ్డిగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయిదెకరాల్లో చెరకు దగ్ధం

కర్నూలు జిల్లా పగిడ్యాల మండలం లక్ష్మాపురంలో అయిదెకరాలలో చెరకు పంట దగ్ధమైంది. ఇమామ్ అనే వ్యక్తి ఈ పంటను సాగు చేస్తున్నాడు. తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో పంట అంతా దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఎకరాకు రూ.80వేలు పెట్టుబడి పెట్టానని వాపోయారు.

English summary
Fire from tamarind tree in Guntur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X