ఏపీ రాజధానికి తొలి సాఫ్ట్వేర్ కంపెనీ, రూ.600 కోట్ల పెట్టుబడి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం పైన సింగపూర్ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా ఏపీ రాజధానిని నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు సింగపూర్ ప్రతినిధులు రాజధాని ప్రాంతంలో పర్యటించారు.
కాగా, అమరావతికి తొలి సాఫ్టువేర్ కంపెనీ అప్పుడే వచ్చేస్తోంది. మంగళగిరి సమీపంలోని ఏపీఐఐసీ భూములలో పైడాటా సెంటర్కు పది ఎకరాల భూమిని కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భూమిని 33 ఏళ్ల పాటు సాఫ్టువేర్ కంపెనీకి లీజుకు ఇచ్చారు.

ప్రతి ఏటా కోటి రూపాయలను ఏపీఐఐసీకి చెల్లించేలా లీజు నిబంధనలలో పేర్కొన్నారు. దాదాపు రూ.600 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును స్థాపించబోతున్నారు. దీని వలన సుమారు ముడు వందల మందికి ఉపాధి లభించనుంది. పరోక్షంగా మరికొంతమందికి ఉపాధి లభిస్తుంది.
భవిష్యత్తు రాజధాని కేవలం పరిపాలనా రాజధానిగా కాకుండా, డైనమిక్గా ఉంటుందని, ఆర్థిక, సామాజిక, ఉపాధి అవకాశాలతో సమగ్ర నిర్ణాయక కేంద్రంగా ఉంటుందని, 21వ శతాబ్దిలోనే మేటి ప్రజా రాజధానిగా అమరావతి భాసిల్లుతుందని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పిన విషయం తెలిసిందే.
ప్రతి తెలుగువాడూ గర్వంగా తలెత్తుకునేలా ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం అన్నారు. తన విశ్వసనీయత వల్లనే సింగపూర్ ఉచితంగా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసిందన్నారు.
-
ఆ ఎమ్మెల్యేలపై వేటు తప్పదు - తేల్చి చెప్పిన సీఎం చంద్రబాబు..!! -
ఈ నెల 13న పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ : ఒకేసారి రూ 6 వేలు..!! -
మండే ఎండల వేళ భారీ వర్షాలు, ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్..!! -
అమరావతి వేదికగా అరుదైన నిర్మాణం, తెలుగు వైభవాన్ని చాటేలా..!! -
రూ.294.20 కోట్లతో రిటైనింగ్ వాల్.. మాట నిలబెట్టుకుంటున్న మంత్రి లోకేష్ -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు












Click it and Unblock the Notifications