ఆహార పదార్థాల కల్తీ నివారణే లక్ష్యం...గుంటూరులో నేడు ఫుడ్ కమిటీ మీటింగ్
ఎపి ఫుడ్ కమిషన్ ఉన్నత స్థాయి సమావేశం నేడు గుంటూరులో జరగనుంది. ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ పుష్పరాజ్ ఈ సమావేశానికి నేతృత్వం వహిస్తారు.
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ ఆధ్వర్యంలో బుధవారం గుంటూరులో కల్తీల నివారణపై ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గుంటూరు కల్తీలకు కేరాఫ్గా మారిందని సర్వత్రా విమర్శలు రేగుతున్న నేపథ్యంలో ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ పుష్పరాజ్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చెయ్యడం గమనార్హం.
కొద్ది రోజుల క్రితమే గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేసిన పుష్పరాజ్ పరిస్థితి పై అవగాహనకు వచ్చారు. గుంటూరు కేంద్రంగా కల్తీ కారం, నెయ్యి, పచ్చళ్లు, పాలు, టీపొడి, పప్పు, పురుగు మందులు, ఆయిల్, ఇతర పదార్థాలు విచ్చలవిడిగా మార్కెట్లోకి వస్తున్నాయి.

కల్తీ, నకిలీ ఆహార పదార్థాల నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు పుష్పరాజ్ అధ్యక్షతన ఈసమావేశాన్ని ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications