వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెరపై మరో రమేష్ కుమార్‌: రిటైర్డ్ ఐఎఎస్ అధికారికి ఏపీలో కీలక పదవి: పశ్చిమ బెంగాల్ నుంచి

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తోన్న పేరు నిమ్మగడ్డ రమేష్ కుమార్. రాజకీయ పరమైన వివాదాలన్నీ ఆయన చుట్టూ తిరుగుతున్నాయి. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను అర్ధాంతరంగా వాయిదా వేయడంతో మొదలైన నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరు.. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని పార్క్ హయత్‌లో భారతీయ జనతా పార్టీ నాయకులతో భేటీ కావడం వరకూ అన్నీ కాంట్రవర్సీలను క్రియేట్ చేసినవే.

ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో తాజాగా మరో రమేష్ కుమార్ పేరు వినిపిస్తోంది. పూర్తిపేరు పెయ్యాల రమేష్ కుమార్. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తరహాలోనే ఆయనా రిటైర్డ్ ఐఎఎస్ అధికారి. కడప జిల్లాకు చెందిన పెయ్యాల రమేష్‌కుమార్‌ను రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ (ఏపీసీఐసీ)గా నియమించే అవకాశాలు ఉన్నాయి. ఆయన నియామకం దాదాపు ఖరారైందని అంటున్నారు. ఆయనను ప్రధాన సమాచార కమిషనర్‌గా నియమిస్తూ త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశాల ఉన్నాయి.

Former IAS P Ramesh Kumar chosen to be AP Chief Information Commissioner

1986 బ్యాచ్ పశ్చిమ బెంగాల్ క్యాడర్‌కు చెందిన ఐఎఎస్ అధికారి ఆయన. 2017లో పదవీ విమరణ చేశారు. ఆయన సేవలను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వినియోగించుకుంటోంది. ప్రస్తుతం ఆయన పశ్చిమ బెంగాల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. రాష్ట్రంలో రెండేళ్లుగా ఖాళీగా ఉంటోన్న సమాచార ప్రధాన కమిషనర్‌గా ఆయనను నియమించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు.

టాప్‌లెస్‌గా శబరిమల ఉద్యమకారిణి: ఆమె అర్ధనగ్న శరీరంపై పెయింట్ వేసిన కొడుకు, కుమార్తెటాప్‌లెస్‌గా శబరిమల ఉద్యమకారిణి: ఆమె అర్ధనగ్న శరీరంపై పెయింట్ వేసిన కొడుకు, కుమార్తె

పెయ్యాల రమేష్ కుమార్ తండ్రి అబ్బయ్య కూడా ఐఎఎస్ అధికారిగా పనిచేశారు. రమేష్ కుమార్ కుటుంబానికి పాలనలో సుదీర్ఘ అనుభవం ఉందని, దాన్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఆయన కేరీర్‌లో ఎలాంటి వివాదాలు గానీ, అవినీతి ఆరోపణలు లేకపోవడం వల్ల పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆయన సేవలను వినియోగించుకుంటోందని వైఎస్ జగన్ భావిస్తున్నారని అంటున్నారు.

English summary
Former bureaucrat P Ramesh Kumar has been chosen as the Andhra Pradesh chief information commissioner (CIC). An IAS officer belonging to the West Bengal cadre from the 1986 batch, Peyyala Ramesh Kumar is currently holding the post of member of the West Bengal Administrative Tribunal after his retirement in 2017. He will serve as CIC, a post that is presently vacant, for two years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X