వైసీపీలో చేరిన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి
తన అనుచరులతో కలిసి మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో వైఎస్ జగన్ సమక్షంలో బుదవారం నాడు వైసీపీలో చేరారు.
హైదరాబాద్: తన అనుచరులతో కలిసి మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో వైఎస్ జగన్ సమక్షంలో బుదవారం నాడు వైసీపీలో చేరారు.
రెండు రోజుల క్రితం ఆయన టిడిపికి రాజీనామా చేశారు. త్వరలో జరిగే నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టిక్కెట్టు కేటాయింపు విషయంలో టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు అనుసరించిన నాన్చివేత ధోరణిని నిరసిస్తూ ఆయన పార్టీకి రాజీనామా చేశారు.

త్వరలో జరిగే నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ తరపున బరిలోకి దిగాలని ఆయన భావిస్తున్నారు. టిడిపిలో టిక్కెట్టు దక్కదనే కారణంగానే ఆయన పార్టీని వీడినట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు. అంతేకాదు మూడేళ్ళుగా టిడిపిలో తాను అవమానాలకు గురైనట్టు శిల్పా చెప్పారు.
నంద్యాల మున్సిఫల్ ఛైర్ పర్సన్ సులోచన, మార్క్ ఫెడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి, పలువరు సర్పంచులు, ఎంపిటీసీ సభ్యులు శిల్పా మోహన్ రెడ్డితో కలిసి వైసీపీలో చేరారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications